📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jawan Sachin Yadav : సరిహద్దులో మరో వీరమరణం

Author Icon By Shobha Rani
Updated: May 10, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాకిస్థాన్ (Pakistan-india) సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ సైన్యం జరిగిన కాల్పుల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీనాయక్ అమరుడయ్యారు. ఇప్పుడు మరో యువ జవాన్‌ కూడా వీరమరణం పొందారు. జమ్మూలో పాక్ కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం పొందారు. సచిన్ యాదవ్‌రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. ఇవాళ స్వస్థలానికి సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివదేహం తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సాధారణ పౌరులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది.

Jawan Sachin Yadav : సరిహద్దులో మరో వీరమరణం

నాందేడ్ జిల్లాలో విషాద ఛాయలు
సచిన్ యాదవ్‌రావు మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దులోని నాందేడ్ జిల్లా తమ్లూర్ గ్రామానికి చెందినవారు. వీరమరణ వార్త తమ్లూర్‌కు చేరకనే గ్రామమంతా శోకసంద్రంగా మారింది. ఇవాళ ఆయన పార్థివదేహం స్వస్థలానికి తీసుకురావాలని అధికారులు వెల్లడించారు. ఇదే ఉద్రిక్తతల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మురళీనాయక్ కూడా గత వారంలో పాక్ కాల్పుల్లో అమరుడయ్యారు. ఈ ఘటనలు పాకిస్థాన్ ఉగ్ర ప్రేరేపిత చర్యల తీవ్రతను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. భారత సైన్యం పాక్ కాల్పులకు తక్షణ ప్రతికారం గా వీరప్రతాపంతో ఎదురుదెబ్బ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు జరిపిన ప్రతిదాడుల ద్వారా పాక్‌కు గుణపాఠం చెప్పినట్లు తెలుస్తోంది. సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణత్యాగం దేశం కోసం చేసిన అమరబలిదానం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం, ఉద్యోగ భరోసా అందించేందుకు సిద్ధమవుతున్నాయి. దేశ ప్రజల మదిలో ఆయన త్యాగం చిరస్మరణీయంగా నిలవనుంది.

Read Also: Pakistan-india: డ్రోన్ దాడులకు తగిన బుద్ధి

Another heroic Breaking News in Telugu death on the border Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.