ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉద్యమకారుల అణిచివేతకు ఉపయోగిస్తోందని ఆరోపణ
ప్రత్యేక దేశం కోసం పోరాడే వారి హక్కులను కాలరాయొద్దన్న ఆమ్నెస్టీ(Amnesty)
బలూచిస్థాన్ ప్రజలు ప్రత్యేక దేశం కోసం శాంతియుతంగా పోరాడుతుంటే, పాకిస్థాన్ వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని మానవ హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టాలను పాక్ దుర్వినియోగం చేస్తూ, బలూచ్ ఉద్యమకారుల అణిచివేతకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 1997 ఉగ్రవాద నిరోధక చట్టం కింద బలూచ్కు చెందిన 32 మందిని పాక్ తన వాచ్ లిస్ట్లో చేర్చడాన్ని ఆమ్నెస్టీ తప్పుబట్టింది.
Read Also: United Nations : ప్రమాదంలో ఐక్యరాజ్యసమితి అస్తిత్వం
ప్రాథమిక హక్కులును భంగం చేస్తున్న పాక్
ప్రత్యేక దేశం కోసం పోరాడే వారిని వాచ్ లిస్ట్లో చేర్చడం సరికాదని, ఇది వారి హక్కులను పూర్తిగా కాలరాయడమేనని ఆమ్నెస్టీ దక్షిణాసియా రీజినల్ డైరెక్టర్ బాబూ రామ్ అన్నారు. పాక్ చర్యల వల్ల స్వేచ్ఛ, గోప్యత, ఉద్యమానికి సంబంధించిన ప్రాథమిక హక్కులు దెబ్బతింటున్నాయని ఆయన ఆరోపించారు. పాక్ తన వాచ్ లిస్ట్లో మహిళలను కూడా చేర్చి హద్దులు దాటిందని విమర్శించారు. దీనివల్ల వాచ్ లిస్ట్లో ఉన్నవారు కఠిన పర్యవేక్షణ, ప్రయాణ ఆంక్షలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. బలూచ్ ఉద్యమకారులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం కూడా వారికి లేకుండా పోయిందని ఆయన అన్నారు.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటే ఏమిటి?
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది మానవ హక్కులను పరిరక్షించడానికి మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి ప్రచారం చేసే ప్రపంచవ్యాప్త ప్రభుత్వేతర సంస్థ.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి?
21వ శతాబ్దం ప్రారంభంలో ఈ సంస్థ 50 కంటే ఎక్కువ దేశాలలో జాతీయ విభాగాలు లేదా కార్యాలయాలను మరియు 150 కంటే ఎక్కువ దేశాలు మరియు భూభాగాలలో దాదాపు మూడు మిలియన్ల మంది వ్యక్తిగత సభ్యులు, దాతలు మరియు అనుబంధ కార్యకర్తలను కలిగి ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: