అమెరికా (America) అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలోని కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రదాడేనని ట్రంప్ (Trump) ధ్వజమెత్తారు. ఈ దాడులకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కారణమని పరోక్షంగా విమర్శలు చేశారు. కాల్పుల తర్వాత అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆఫ్ఘానిస్థాన్ కు చెందిన వాడని అన్నారు. అతడు జో బైడెన్ అధికారంలోకి ఉన్నప్పుడే ప్రవేశించాడని ఆరోపించారు.
Read Also: Indonesia: ఇండోనేషియాలో కొండచరియలు విరిగి 23మంది మృతి
బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఆఫ్గాన్ నుంచి వచ్చిన వాళ్లని మళ్లీ విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాల్పులు జరగడంతో వాషింగ్టన్ లో మరో 500 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
కాల్పులు జరిపింది అఫ్గాన్ నిందితుడే
కాల్పులు చేసిన నిందితుడు అప్గానిస్థాన్ కు చెందిన రెహ్మనుల్లా లఖన్ వాల్ అని లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెల్లడించారు. 2021లో ఆఫ్ఘానిస్థానీయులకు ఇచ్చిన స్పెషల్ వీసాపై అమెరికాకు వచ్చినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో నిందితుడికి గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించామని అయితే అతడు ఒక్కడే ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత భద్రత ఉండే ప్రదేశాల్లో వైట్ హౌస్ ఒకటి. కానీ ఇక్కడ కూడా అప్పుడప్పుడు నిరసనలు, దాడులు జరుగుతుంటాయి. అయితే ఆఫ్గాన్ కు చెందిన అతడు తాజాగా వైట్ హౌస్ వద్ద ఎందుకు కాల్పులు జరిపాడనేదానిపై క్లారిటీ లేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: