అమెరికా-వెవెజులా మధ్య గతకొంత కాలంగా తీవ్ర విభేదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో పై తీవ్రవ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. వెనెజులా తమదేశానికి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నదని, తద్వారా తమ దేశ పౌరులు నేరాలకు పాల్పడుతున్నారని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పలుమార్లు నికోలస్ ను ట్రంప్ హెచ్చరించారు.
Read Also: Ukraine: సవరణల తర్వాతే శాంతి ప్రణాళిక: జెలెన్ స్కీ
దేశాన్ని వీడాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చల్లో తాను, తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నానని వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో (Venezuelan Nicolas Maduro) పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకు ఆయన కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. ఈ మేరకు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
ఆంక్షల నుండి ఉపశమనాన్ని కోరిన నికోలస్
గత నెలలో ట్రంప్, మదురోలు 15 నిమిషాల కంటే తక్కువ సమయం పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో తనకు, తన కుటుంబానికి ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తే.. తాను వెనెజువలాను వీడేందుకు సిద్ధంగా ఉన్నానని మదురో తెలిపినట్లు సమాచారం.
యూఎస్ విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తాను ఎదుర్కొంటున్న కేసును మూసివేయడం వంటి వాటి గురించి ప్రస్తావించారు. దీంతోపాటు అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి 100 మందికి పైగా వెనెజులా అధికారులపై విధించిన ఆంక్షల నుంచి యూఎస్ ఉపశమనం కల్పించాలని కూడా ఆయన కోరినట్లు సమాచారం.
తిరస్కరించిన ట్రంప్
మదురో షరతుల్లో చాలావాటిని ట్రంప్ (Trump) తిరస్కరించినట్లు రాయిటర్స్ పేర్కొంది. మదురో తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు ట్రంప్ ఒక వారం రోజులు గడువు విధించినట్లుగా తెలుస్తోంది. అయితే, అది శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో వెనుజులా భూభాగంలో ఆపరేషన్లకు ట్రంప్ ప్రకటన చేసినట్లు సమాచారం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: