అమెరికా(America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈఏడాది జనవరిలో రెండోసారి అధికారంలో వచ్చారు. తన దేశపౌరులకే మొదటి ప్రాధాన్యత అంటూ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నవిధంగానే ట్రంప్ అమెరికా పౌరులకు ఉద్యోగాల కల్పనక కృషి చేస్తున్నారు. దీంతో వలసవాదులపై కఠిన చర్యలకుదిగారు. వీసా గడువు ముగిసిపోయి, అక్రమంగా ఉంటున్నవారిని బలవంతంగా వెనక్కి పంపిస్తున్న విషయం విధితమే. అంతటితో ఆగకుండా విదేశీయుల రాకను భారీసంఖ్యలో తగ్గించే ప్రయత్నంలో సక్సెస్ పొందుతున్నారు. కఠిన వీసా నిబంధనల వల్ల విదేశీయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ప్రపంచదేశాలపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. వాణిజ్యయుద్ధంతో మొదలై, వీసాల పేరిట యుద్ధాన్నే చేస్తున్నారు ట్రంప్.
Read Also: Salehuddin Ahmed: దిగొచ్చిన బంగ్లా.. భారత్ తో బంధానికి యూనస్ యత్నం

హెచ్-1బి వీసాలపై(America) ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయానికి తూట్లు పొడిచారు. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. హెచ్-1బి లాటరీ విధానాన్ని రద్దు చేసింది. దీని స్థానంలో కొత్త పథకంతో భర్తీ చేస్తోంది. నైపుణ్యం కలిగిన కార్మికులు, అధిక వేతనం పొందే విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. తాజా నిర్ణయంతో భారతీయులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి.
ఫిబ్రవరి 27 నుంచి కొత్త నియమం
హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకారం ఈ కొత్త నియమం ఫిబ్రవరి 27,2026 నుంచి అమల్లోకి రానుంది. ఇది 2027 ఆర్థిక సంవత్సరం క్యావ్ రిజిస్ట్రేషన్ కు వర్తించనుంది. అంటే ఆ సంవత్సరం ప్రారంభమయ్యే ఉద్యోగాల కోసం మారిన, 2026లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని సమాచారం. అయితే సాధారణ కోటా కింద ప్రతి ఏడాది ఇచ్చే 85,000 సంఖ్యను 65,000కి పరిమితం చేసినట్లు సమాచారం.
యజమాని సూచించిన విధంగా అధిక జీతాలు ఉన్నవారికి మాత్రం ఈ వీసాలు వర్తించనున్నాయి. వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం భారతీయులకు ఎక్కువ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హెచ్-1బి రెన్యూవల్ కోసం ఇండియాకు వచ్చి చిక్కుకుపోయిన భారతీయులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులకు కూడా తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందో లేదో అనే ఆందోళనలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: