हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

America: పాలస్తీనా అనుకూల నినాదాలకు యుఎస్ లో ఉగ్రదాడి

Sharanya
America: పాలస్తీనా అనుకూల నినాదాలకు యుఎస్ లో ఉగ్రదాడి

అమెరికాలో ఇజ్రాయెల్-పాలస్తీన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అక్కడి ప్రవాసుల మధ్య తీవ్ర రూపం దాల్చింది. తాజాగా కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ నగరంలో చోటుచేసుకున్న దారుణ ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. నిరసన తెలిపే హక్కును లంకించే విధంగా జరిగిన ఈ దాడిలో పలువురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని లక్ష్యిత ఉగ్రదాడిగా అధికారులు ప్రకటించారు.

దాడి సంఘటన వివరాలు

2025 మే 31వ తేదీన బౌల్డర్‌ (Boulder) నగరంలోని ఓ మాల్‌ ఎదుట ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడిపించాలంటూ కొంతమంది అమెరికన్‌ యువకులు, వృద్ధులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బందీలను విడుదల చేయాలంటూ వారు నినాదాలు చేస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. నినాదాలు చేస్తున్న వారిపై ద్రవపదార్థాలు నింపిన సీసాలతో ఫ్లేమ్ త్రోవర్‌ ఉపయోగించి దాడి చేశాడు. దీంతో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పలువురు వృద్ధులు కాలిన గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో 67 నుంచి 88 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో నలుగురు మహిళలు కాళ్లకు కాలిన గాయాలతో నేలపై పడి ఉండటం చూశానని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఒక మహిళ శరీరం చాలా వరకు కాలిపోయిందని, ఆమెను ఒక జెండాతో కప్పి ఉంచారని ఆమె తెలిపారు.

దాడిలో నిందితుడి వివరాలు

ఈ దారుణ చర్యకు పాల్పడిన వ్యక్తిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాన్‌గా ఎఫ్‌బీఐ గుర్తించింది. దాడి అనంతరం “జియోనిస్టులను అంతం చేయండి!”, “ఫ్రీ పాలస్తీనా!”, “వారు హంతకులు!” అంటూ సోలిమాన్ బిగ్గరగా అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఎఫ్‌బీఐ, అధికారులు స్పందన

ఈ దాడిని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ “లక్షిత ఉగ్రవాద చర్య”గా పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వైజర్ మాట్లాడుతూ, దాడికి గురైన సమూహాన్ని బట్టి ఇది విద్వేషపూరిత నేరంగా కనిపిస్తోందన్నారు. ఈ ఘటనలో మరొకరి ప్రమేయంలేదని బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్‌ఫర్న్ పేర్కొన్నారు. నిందితుడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వివరించినట్లు వైట్‌హౌస్ తెలిపింది.

ఇదే తరహాలో ఇటీవలి ఘటన: చికాగో ఘటన స్మరణ

ఇటీవల మే 21న చికాగోకు చెందిన ఎలియాస్ రోడ్రిగుజ్ అనే వ్యక్తి వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ (Israel) రాయబార కార్యాలయం వద్ద ఇద్దరిని కాల్చి చంపాడు. “పాలస్తీనా కోసం, గాజా కోసం చేశాను” అని నిందితుడు అరెస్ట్ సమయంలో అరిచాడు. ఈ రెండు సంఘటనలు అమెరికాలోని ముస్లిం సముదాయంలో ఉన్న తీవ్ర ఆందోళనను, ఆవేశాన్ని ప్రతిబింబిస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read also: Mallikarjun Kharge: ఖర్గే వ్యాఖ్యలపై జేడీయూ ఘాటు స్పందన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870