న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థి జొహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నగరానికి తొలి ముస్లిం, వలసదారు మేయర్గా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే, ఆయన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ‘ఉచితాల’ (Freebies) మోడల్ హామీలే ఈ గెలుపు వెనుక కీలక పాత్ర పోషించాయని, ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
Read Also: Donald Trump: భారత్-పాక్ మధ్య యుద్ధం మళ్లీ మళ్లీ అదే పాట
ఉచిత బస్సు ప్రయాణం: ఆప్ ‘పింక్ టికెట్’ తరహా వ్యూహం
మమ్దానీ ఇచ్చిన ప్రధాన హామీ న్యూయార్క్ నగరంలో బస్సు ప్రయాణాన్ని పూర్తిగా ఉచితం చేయడం. ఈ పథకం ఢిల్లీలో(Delhi) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రవేశపెట్టిన ‘పింక్ టికెట్’ పథకాన్ని పోలి ఉంది. 2019లో కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు(Free bus) ప్రయాణ సౌకర్యం కల్పించగా, అది 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ భారీ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి కూడా మహిళలకు ఉచిత బస్సు హామీ ఇచ్చి విజయం సాధించాయి. ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని మమ్దానీ న్యూయార్క్లో అమలు చేయబోతున్నారు.
నిధుల సేకరణ, ఇతర సంక్షేమ హామీలు
న్యూయార్క్లో(New York) బస్సులను ఉచితం చేయడానికి ఏటా 1.2 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. ఈ నిధుల కోసం మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం ఉన్నవారిపై 2 శాతం పన్ను విధించాలని, కార్పొరేట్ సబ్సిడీలను తగ్గించాలని మమ్దానీ ప్రతిపాదించారు. ఢిల్లీలో రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించగా, మమ్దానీ సంపన్నులపై పన్ను ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈయన మేనిఫెస్టోలో యూనివర్సల్ చైల్డ్ కేర్, ఇళ్ల అద్దెల పెరుగుదల 3 శాతానికి మించకుండా నియంత్రించడం, తక్కువ ధరలకే నిత్యావసరాలు అందించే ‘పీపుల్స్ మార్కెట్స్’ ఏర్పాటు వంటి హామీలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటైన న్యూయార్క్లో, భారత్లోని పేద రాష్ట్రాల్లో విజయవంతమైన ఉచిత హామీలకు ఆదరణ లభించడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: