ఇటీవల విమానప్రమాదాల (Airplane crashes) సంఖ్య పెరుగుతున్నది. తరచూ విమాన ప్రమాదాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఒక్క విమాన ప్రమాదాలకే కాదు, వాహనాల ప్రమాదాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్షణాల్లో పాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా అమెరికాలోని కెంటకీలో విమాన ప్రమాదం జరిగింది. ఇందులో 14మంది చనిపోయారు. ఈ దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: GHMC: రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు
విమానం నుంచి ఇంజిన్ విడిపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు బృందం నిర్ధారించింది. మంటల్లో నుంచి ఇంజిన్ విడిపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు బృందం నిర్ధారించింది. మంటల్లో నుంచి విమానం ఇంజిన్ ఎగిరిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమెరికా (America) కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం లూయిస్ విల్లేలోని ముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం టకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న యుపిఎస్ కార్గో విమానం కూలిపోయి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. ప్రమాదానికి గురైన విమానం హోనులూలుకు వెళుతోంది.
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు
విమానం ఎగరడానికి ముందే దాని ఎడమ క్కె నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించాయి. దాని తరువాత ఫ్లైట్ కిందపడిపోయి కూలిపోయింది. నేలను ఢీకొన్న వెంటనే పెద్ద శబ్దంతో పాటూ, ఎగిసిన మంటలు, దట్టమైన పొగ కమ్మకున్నాయి. విమానం కొద్దిసేపు నేల నుండి లేచి రన్ వేపైకి దూసుకెళ్లి భారీ అగ్నిగోళంగా విస్ఫోటనం చెందింది. విమానం కింద పడడంతో దగ్గరలో ఉన్న ఒక భవం పైకప్పు పూర్తిగా దెబ్బతింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: