📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ajit Doval: భరత్ చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి

Author Icon By Pooja
Updated: August 19, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-చైనా(India China) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశలో పయనిస్తున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన ముగిసినప్పటి నుంచి రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొందని, ఇది ఇరు దేశాలకూ ప్రయోజనకరంగా ఉందని ఆయన అన్నారు. సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన మంగళవారం ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో 24వ విడత చర్చలు నిర్వహించారు.

ఈ భేటీ ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు కొద్ది రోజుల ముందు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాలోని టియాన్జిన్‌లో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ(Shanghai Cooperation Organization) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని దోవల్ ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఈ చర్చలు చాలా కీలకమైనవని ఆయన తెలిపారు.

Ajit Doval

రెండు దేశాల సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి

గత తొమ్మిది నెలలుగా భారత్-చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయని అజిత్ దోవల్ చెప్పారు. “సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి. శాంతి, సామరస్యం నెలకొన్నాయి. మన ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భేటీ తర్వాత ఈ కొత్త వాతావరణం ఏర్పడింది” అని ఆయన వివరించారు.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, గతంలో ఇరు దేశాల సంబంధాల్లో ఎదురైన ఒడిదుడుకులు ఎవరికీ మంచివి కావని అన్నారు. గత ఏడాది మోదీ, జిన్‌పింగ్ భేటీ ద్వైపాక్షిక సంబంధాల(Bilateral relations) అభివృద్ధికి సరైన మార్గదర్శనం చేసిందని, సరిహద్దు సమస్య పరిష్కారానికి ఊతమిచ్చిందని ఆయన చెప్పారు. “సరిహద్దుల్లో ఇప్పుడు నెలకొన్న స్థిరత్వం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రధాని మోదీ మా ఆహ్వానం మేరకు ఎస్‌సీఓ సదస్సు కోసం చైనాకు రానుండటాన్ని మేము ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీతో వాంగ్ యీ భేటీ

2020 ఏప్రిల్-మే నెలల్లో లడక్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద మొదలైన సైనిక ప్రతిష్టంభన, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా ఇరు దేశాల సంబంధాలు ఆరు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. 2024 అక్టోబర్ 21న ప్రతిష్టంభన ముగియడంతో, ఆ తర్వాత రెండు రోజులకే మోదీ-జిన్‌పింగ్ కజాన్‌లో సమావేశమై సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. తాజా చర్చల్లో సరిహద్దుల్లో పరస్పర నమ్మకాన్ని పెంచే చర్యలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ పర్యటన ముగింపులో వాంగ్ యీ ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నారు.

ఇటీవల భారత్-చైనా మధ్య జరిగిన చర్చలు ఏ స్థాయివి?

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో 24వ విడత చర్చలు జరిగాయి.

సరిహద్దుల్లో శాంతి ఎలా నెలకొంది?

గత ఏడాది అక్టోబర్‌లో సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడింది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య రష్యాలోని కజాన్‌లో జరిగిన భేటీ ఈ మార్పుకు కారణమని దోవల్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/trump-donald-tariff-impact-on-india-jobs/international/532728/

Ajit Dovel Bilateral relations Google News in Telugu India china Latest News in Telugu PM Modi Telugu News Today two countries

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.