Ahmed Al Ahmed : ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలను పణంగా పెట్టి దాడి చేసిన వ్యక్తిని నిలువరించిన అహ్మద్ అల్ అహ్మద్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. యూదుల పండుగ హనుక్కా సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకోగా, అహ్మద్ చూపిన ధైర్యం అనేక మంది ప్రాణాలను కాపాడిందని అధికారులు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన 15 సెకన్ల వీడియోలో, ఆయుధం లేని అహ్మద్ పార్క్ చేసిన కార్ల వెనుక దాక్కుని, సరైన సమయంలో వెనుక నుంచి దాడి చేసిన వ్యక్తిపై దూకి అతని మెడ పట్టుకుని తుపాకిని లాక్కొని నేలకూల్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అదే ఆయుధాన్ని దాడి చేసిన వ్యక్తిపైకి గురిపెట్టాడు.
Read also: Amit Shah: నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన
స్థానిక మీడియా కథనాల ప్రకారం, 43 ఏళ్ల అహ్మద్ (Ahmed Al Ahmed) అల్ అహ్మద్ వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. ఈ ఘటనలో అతడికి రెండు తూటా గాయాలు అయ్యాయి. ఆయుధాలపై ఎలాంటి శిక్షణ లేకపోయినా, అక్కడి పరిస్థితిని గమనించి సహజసిద్ధంగా స్పందించాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ దాడిలో కనీసం 16 మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ ఇజ్రాయెల్ పౌరుడు కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. దాడి చేసినవారు తండ్రి–కొడుకులు కాగా, తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ అహ్మద్ను “నిజమైన హీరో”గా అభివర్ణిస్తూ, దేశ భద్రతా కమిటీ అత్యవసరంగా సమావేశమైందని తెలిపారు. యూదులపై జరిగిన ఈ దాడిని దేశంపై జరిగిన దాడిగా పరిగణిస్తామని, ద్వేషం, హింసకు ఆస్ట్రేలియాలో స్థానం లేదని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: