ఇప్పటికే భారత్తో జల(water) వివాదాలతో సతమతమవుతున్న పొరుగు దేశం పాకిస్థాన్కు తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్థాన్ గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్థాన్కు(Pakistan) ప్రవహించే కీలకమైన కునార్ నదిపై భారీ డ్యామ్ను నిర్మించి, నీటి ప్రవాహాన్ని నియంత్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు డ్యామ్ నిర్మాణ పనులను వీలైనంత వేగంగా ప్రారంభించాలని తాలిబన్ సుప్రీం లీడర్ మౌల్వీ హిబతుల్లా అఖుంద్జాదా జల, ఇంధన మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన భీకర సరిహద్దు ఘర్షణల అనంతరం అఫ్గానిస్థాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Read Also: TTD: మీ వద్ద ఆధారాలు ఉంటే ఇవ్వండి: డిఎస్పీ

దేశీయ కంపెనీలతోనే ప్రాజెక్టు
ఆఫ్ఘన్ జల, ఇంధన మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. విదేశీ సంస్థల కోసం ఎదురుచూడకుండా, దేశీయ కంపెనీలతోనే ఒప్పందాలు కుదుర్చుకోవాలని సుప్రీం లీడర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచార శాఖ ఉప మంత్రి ముహాజెర్ ఫరాహీ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. లండన్కు చెందిన ఆఫ్ఘన్ జర్నలిస్ట్ సామి యూసఫ్జాయ్ మాట్లాడుతూ, “భారత్ తర్వాత, ఇప్పుడు పాకిస్థాన్కు నీటి సరఫరాను పరిమితం చేసే వంతు ఆఫ్ఘనిస్థాన్కు వచ్చినట్లుంది” అని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్పై తీవ్ర ప్రభావం
ఆఫ్ఘనిస్థాన్లోని హిందూకుష్ పర్వతాల్లో పుట్టే 480 కిలోమీటర్ల పొడవైన కునార్ నది, పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోకి ప్రవేశించి కాబూల్ నదిలో కలుస్తుంది. కునార్ నదిపై డ్యామ్ నిర్మిస్తే, దాని ప్రభావం కాబూల్ నదిపై, ఆ తర్వాత సింధు నదిపై పడుతుంది. దీంతో పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాతో పాటు పంజాబ్ ప్రావిన్స్లో కూడా సాగునీరు, తాగునీటి అవసరాలకు తీవ్ర సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఆఫ్ఘన్ ఏకపక్ష నిర్ణయాలు ప్రాంతీయంగా తీవ్ర నీటి సంక్షోభానికి దారితీయవచ్చని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
భారత్తో జలవనరుల సహకారం
ఒకవైపు పాకిస్థాన్కు నీటిని నియంత్రించాలని తాలిబన్లు నిర్ణయిస్తుండగా, మరోవైపు వారం రోజుల క్రితమే ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి మౌల్వీ ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత్లో పర్యటించి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జలవిద్యుత్ ప్రాజెక్టులు, డ్యామ్ల నిర్మాణంపై సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. భారత్ సహాయంతో నిర్మించిన సల్మా డ్యామ్ (ఆఫ్ఘన్-ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్), త్వరలో చేపట్టబోయే షహతూత్ డ్యామ్ ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనం.
ఆఫ్ఘనిస్థాన్ ఏ నదిపై డ్యామ్ నిర్మించాలని నిర్ణయించింది?
పాకిస్థాన్కు ప్రవహించే కీలకమైన కునార్ నదిపై డ్యామ్ నిర్మించాలని నిర్ణయించింది.
డ్యామ్ నిర్మాణాన్ని ఎవరు వేగవంతం చేయాలని ఆదేశించారు?
తాలిబన్ సుప్రీం లీడర్ మౌల్వీ హిబతుల్లా అఖుంద్జాదా ఈ ఆదేశాలు ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: