ఆఫ్ఘానిస్తాన్ మీద కాలు దువ్వి పాకిస్తాన్ తప్పు చేసింది. దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తోంది. ఇప్పటికే పహల్గందాడికి ప్రతీకారంగా భారత్ సింధు జలాలను పరిమితం వేసింది. దీంతో పాక్ నీళ్లు లేక విలవిలలాడుతోంది. పుండుమీద కారం చల్లిన సామెతలా ఆఫ్ఘన్ కూడా పాక్ పై మరో బాంబు పేల్చడానికి సిద్ధమైంది. ఇరుదేశాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న కునార్ నది నీటిని మళ్లించే ప్రాజెక్టు తాలిబన్ (Taliban) ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కునార్ నది నుంచి నంగర్ హార్ లోని దారుంతా డ్యామ్ కు నీటిని మళ్లించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీనిపై తుది నిర్ణయం కోసం ఆఫ్గాన్ ప్రధాన కార్యాలయం ఆర్థిక కమిషన్ కు పంపింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆఫ్ఘానిస్తాన్ నంగర్ హార్ ప్రావిన్సులో వ్యవసాయ భూములకు నీటి కొరత తీరుతుంది.
Read also: US: వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం
పాకిస్తాన్ లో ప్రవహించే పెద్ద నదుల్లో కునార్ నది ఒకటి
ఇది ఆ దేశానికి చాలా మేలు చేస్తుంది. కానీ పాకిస్తాన్ కు మాత్రం సరదా తీరిపోతుంది. కునార్ నది నీరు రాకపోతే పాక్ లో ఖైబర్ పఖుంఖ్వా ఎడారిగా మారిపోతుంది. సుమారు 500 కిలోమీటర్లు ప్రవహించే కునార్ నది ఖైబర్ పల్తుంఖ్వా పావిన్స్ లోని చిత్రాల్ జిల్లాలో హిందూ కుష్ పర్వతాల నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి ఆఫ్ఘన్ లోకి ప్రవహించి, కునార్, నంగర్ హార్ ప్రావిన్స్ ల గుండా పర్వతాల నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి ఆఫ్ఘన్ లోకి ప్రవహించి, కునాల్, నంగర్ హార్ ప్రావిన్సుల గుండా ప్రవహించి తూర్పుగా తిరిగి పాక్ లోకి ప్రవేశించి, పంజాబ్ ప్రావిన్సుల్లోని అట్టాక్ నగరం సమీపంలో సింధునదికి చేరుతు బూల్ నదిలో కలుస్తుంది. అక్కడి నుంచి పెచ్ నది నీటితో కలిసి పాకిస్తాన్ లో ప్రవహించే పెద్ద నదుల్లో కునార్ నది ఒకటి. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ముఖ్యమైన వనరుగా ఉంది.
వీలైనంత త్వరగా ఆనకట్ట నిర్మించాలని
కునార్ నది పాక్ లోకి తిరిగి ప్రవేశించే ముందు దానిపై ఆనకట్టలు నిర్మిస్తే.. అక్కడి వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ప్రాజెక్టులకు నీటి లభ్యత తీవ్రంగా దెబ్బ తింటుంది. సింధుజలాల మాదిరిగా ఈ నదిపై కాబూల్ తో పాక్ కు ఎటువంటి ఒప్పందాలు కూడా లేవు. ఆఫ్ఘాన్ నిర్మాణానికి భారత్ మద్దతు కునార్ నదిపై డ్యామ్ నిర్మించాలంటూ తాలిబాన్ అధినేత హిబతడుల్లా అఖుంద్ జాదా ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా ఆనకట్ట నిర్మించాలని ఆదేశించారు. విదేశీ కంపెనీల కోసం వేచి చూడకుండా, ప్రాజెక్టును ప్రారంభించడానికి దేశీయ కంపెనీలో ఒప్పందాలు చేసుకోవాలని మంత్రి ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్మాణానికి భారత్ తన మద్దతు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న అన్ని ప్రయత్నాలకు భారతదేశం అండగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: