ఆసియా కప్ 2025 (Asia Cup 2025) క్రికెట్ టోర్నమెంట్కు ఆతిథ్యమిచ్చిన యూఏఈతో భారత్ జట్టు తన తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఉత్సాహపరిచింది. బుధవారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరులో, ఆతిథ్య యూఏఈ జట్టును భారత్ 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో టోర్నీలో భారత్ తన శుభారంభం నమోదు చేసుకుంది.
ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma). భారత ఇన్నింగ్స్ ఆరంభంలో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ బాది, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డును తన పేరుతో ముద్రించాడు. ఇంతవరకు ఏ భారత బ్యాటర్కూ సాధ్యం కాని ఈ ఘనతను అభిషేక్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఈ ప్రత్యేక క్షణం అభిమానుల్లో సంబరాలు రేపింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్యకుమార్
దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Captain Suryakumar Yadav) తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మాయాజాలంతో యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. కేవలం 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతనికి శివమ్ దూబే (3 వికెట్లు) చక్కటి సహకారం అందించడంతో యూఏఈ జట్టు 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది.అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చాడు.

స్వల్ప లక్ష్యంతో
హైదర్ అలీ వేసిన ఇన్నింగ్స్ (innings) తొలి బంతికే భారీ సిక్స్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Vice-captain Shubman Gill),(20 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేయడంతో భారత్ కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “వికెట్ ఎలా స్పందిస్తుందో చూడటానికే బౌలింగ్ ఎంచుకున్నాను.
ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్
మా కుర్రాళ్లు సమష్టిగా రాణించారు. కుల్దీప్ (Kuldeep) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అభిషేక్ ఎందుకు ప్రపంచ నంబర్ వన్ బ్యాటరో మరోసారి నిరూపించాడు. లక్ష్యం 200 అయినా, 50 అయినా అతను ఒకేలా ఆడతాడు. అతని ఆటతీరు నమ్మశక్యం కాదు. పాకిస్థాన్తో మ్యాచ్ కోసం మేమంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం” అని తెలిపాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: