Nuclear Threat to India: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ, పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు భారత్లో కలకలం రేపుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ అమెరికా గనుక పాకిస్థాన్పై సైనిక చర్యకు దిగితే, తమ దేశం భారత్లోని ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలపై అణుబాంబులతో దాడి చేస్తుందని హెచ్చరించారు. అమెరికా తమకు అందనంత దూరంలో ఉందని, అందుకే తాము భారత్ను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన పేర్కొనడం గమనార్హం.
Read Also: Indian PM: ఇరాన్ అధ్యక్షుడికి పండుగల శుభాకాంక్షలు తెలిపిన మోదీ
అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యల సారాంశం
అబ్దుల్ బాసిత్ తన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ రక్షణ వ్యూహాన్ని వివరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అమెరికా మాపై దాడి చేస్తే, మాకు ప్రతికారం తీర్చుకోవడానికి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం ఇండియానే. మా అణు క్షిపణులు ముంబై, ఢిల్లీలను నిమిషాల్లో బూడిద చేయగలవు. మా వద్ద ఉన్న క్షిపణులు అమెరికా భూభాగం వరకు వెళ్లలేకపోవచ్చు, కానీ మా పొరుగున ఉన్న భారత్ను మాత్రం మేము వదలము” అని ఆయన ఘాటుగా స్పందించారు. ఇది పూర్తిగా ‘స్ట్రాటజిక్ డిటరెన్స్’ లో భాగమని ఆయన సమర్థించుకున్నారు.
Nuclear Threat to India: యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ హెచ్చరిక
అబ్దుల్ బాసిత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి రెండు రోజుల ముందే, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ సెనేట్ కమిటీ ముందు సంచలన నివేదికను సమర్పించారు.పాకిస్థాన్ నుండి అమెరికాకు మరియు ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉందని ఆమె హెచ్చరించారు.పాక్ రహస్యంగా దూర పరిధి క్షిపణులను (ICBMs) అభివృద్ధి చేస్తోందని, ఇవి భవిష్యత్తులో అమెరికా భూభాగాన్ని కూడా తాకగలవని ఆమె నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక వెలువడిన వెంటనే పాక్ నుండి ఇటువంటి ప్రతిస్పందన రావడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
భారత విదేశాంగ శాఖ (MEA) స్పందన
పాక్ మాజీ రాయబారి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్కు అక్రమంగా అణు సాంకేతికతను ప్రోత్సహించిన చరిత్ర ఉందని, ఇటువంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు వారి అసలు నైజాన్ని బయటపెడుతున్నాయని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. భారత్ తన రక్షణ విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ఇటువంటి బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: