భారత్, చైనా (India-China)ల మధ్య తగాదాలు పెట్టేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా (Russia) విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ (Sergei Lavrov) సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ‘సరిహద్దులు లేని సంస్కృతి, సాంస్కృతిక దౌత్యం పాత్ర, అభివృద్ధి అనే సమావేశంలో లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తే.. చైనా వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ పశ్చిమ దేశాలు ఇండో- పసిఫిక్ ప్రాంతం అని పిలవడం మొదలుపెట్టాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ (Sergei Lavrov) తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్-చైనా (India-China) సంబంధాలపై ఆసక్తికరంగా మారాయి. “పశ్చిమ దేశాలు చైనా వ్యతిరేక ధోరణితో ఇండో-పసిఫిక్ అనే పదాన్ని ప్రవేశపెట్టాయి. దీనివల్ల భారత్-చైనా (India-China)మధ్య ఎప్పుడైనా గొడవలు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు,” అని పేర్కొన్నారు.
పాక్కు నిధులు..చైనాకు సాయం?
భారత్, ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్లు కలిసి ఏర్పాటైన క్వాడ్ను గతంలో లావ్రోవ్ తీవ్రంగా తప్పుబట్టారు. చైనాను కట్టడి చేసేందుకే దీన్ని ఏర్పాటు చేశారని విమర్శించేవారు. అయితే, ఆస్ట్రేలియా, యూకే, యూఎస్లు కలసి ఆకుస్ (AUKUS) సైనిక కూటమి ఏర్పాటు తర్వాత ఆయన క్వాడ్పై విమర్శలు చేయడం ఆపేశారు. ఈసందర్భంగా పశ్చిమదేశాలు ఆగ్నేయ ఆసియా దేశాలను అణగదొక్కాలని చూస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమ దేశాలు భారత్, చైనా లాంటి శక్తివంతమైన దేశాల మధ్య భిన్నాభిప్రాయాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయని లావ్రోవ్ (Sergei Lavrov) అభిప్రాయపడ్డారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని శాంతి, సహకారాన్ని దెబ్బతీసేలా విదేశీ కుట్రలు సాగుతున్నాయని ఆయన హెచ్చరించారు. తాము ఇక్కడ దశాబ్దాలుగా భాగస్వాములుగా ఉంటూ ఆర్థికంగా, రాజకీయంగా, సైనికపరంగా బలపడుతున్నామని లావ్రోవ్ తెలిపారు. ఈక్రమంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే పశ్చిమదేశాలకు చెందినవారు ఇక్కడ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారన్నారు. ఈక్రమంలోనే వారు ఆగ్నేసియా ఆసియా దేశలను అణగదొక్కాలనుకుంటున్నారని ఆరోపించారు.
Read Also: Taliban: తాలిబాన్ మంత్రితో జైశంకర్ చర్చలు