ఇంగ్లాండ్ చరిత్రలో (In the history of England) మరచిపోబడిన ఓ హత్య మిస్టరీకి ఎట్టకేలకు తెరలేపింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 14వ శతాబ్దంలో జరిగిన ఓ మతగురువు హత్య వెనుక అసలు నిజాన్ని బయటపెట్టారు.1337 మే నెలలో జాన్ ఫోర్డ్ అనే మతగురువును కొంతమంది దుండగులు గొంతుకోసి చంపారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనం. కానీ హంతకులు ఎవరన్నది తేలలేదు. తాజాగా, “మిడీవల్ మర్డర్ మ్యాప్స్” ప్రాజెక్ట్లో భాగంగా ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది.కేంబ్రిడ్జ్ క్రిమినాలజీ ఇన్స్టిట్యూట్కు చెందిన మాన్యుయెల్ ఐస్నర్ (Manuel Eisner) ఈ కేసును పరిశీలించారు. అప్పటి అధికార నివేదికలు, చర్చ్ ఆర్కైవ్లు ఆధారంగా తేల్చిన విషయాలు శోకాన్నికంటే ఆశ్చర్యం కలిగించాయి.(Ela Fitzpayne)
ఫిట్జ్పేన్ అవమానం… హత్యకు దారి
ఎల్లా ఫిట్జ్పేన్ అనే ఉన్నత వంశీయురాలిపై వివాహేతర సంబంధాల ఆరోపణలు వచ్చాయి. ఆమెకు ప్రీస్ట్ ఫోర్డ్తో అక్రమ సంబంధం ఉందన్న ప్రచారంతో చర్చి ఆమెను బహిరంగంగా అవమానించింది. చెప్పుల్లేకుండా నడిపించి, ఆభరణాలపై నిషేధం విధించింది. ఈ అవమానమే ఆమెను కదిలించి, హత్యకు దారి తీసినట్టు తేలింది.ఫోర్డ్ హత్య ఒక పక్కా ప్రణాళిక అని ఐస్నర్ చెప్పారు. ఫిట్జ్పేన్ సోదరుడితో పాటు ఆమె సేవకులిద్దరూ హత్యలో భాగం అయ్యారు. ఇది కేవలం వ్యక్తిగతం కాదు, సామాజిక-రాజకీయ పరిణామాలకు చిహ్నం కూడా.
చర్చి-ప్రభువర్గాల మధ్య ఉద్రిక్తతలకు నిదర్శనం
ఈ కేసు కేవలం ఓ హత్యకేసే కాదు. మధ్యయుగపు ఇంగ్లాండ్లో చర్చి, ప్రభువర్గాల మధ్య ఉన్న శక్తిపోరు, నైతిక ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఫోర్డ్ రెండు వర్గాల మధ్య నలిగిపోయాడన్నది స్పష్టం.
మధ్యయుగపు చరిత్రపై కొత్త వెలుగు
ఈ శోధన గతకాల సామాజిక నిర్మాణాల్లో ఉన్న విభేదాలను, మహిళల స్థితిగతులను, చర్చి నియంత్రణను సమగ్రంగా వివరిస్తోంది. ఇది చరిత్రను తిరిగి చూస్తూ కొత్త కోణాన్ని అందించిన అధ్యయనం.
Read Also : Narendra Modi : కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి మోదీకి ఫోన్ కాల్