📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

2వేల మంది యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై ట్రంప్‌ వేటు

Author Icon By sumalatha chinthakayala
Updated: February 24, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూఎస్​ఎయిడ్ వెబ్​సైట్​లో ఓ నోటీసు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఓ వైపు ప్రపంచ దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసిన ట్రంప్ తాజాగా యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ యూఎస్ ఎయిడ్‌ ఉద్యోగులపై ట్రంప్‌ వేటు వేశారు. రెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు యూఎస్​ఎయిడ్ వెబ్​సైట్​లో ఓ నోటీసు ద్వారా తెలిపారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మిగిలినవారిలో కొంతమందిని మినహాయించి వేలమంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఎయిడ్‌ ఉద్యోగులపై ట్రంప్‌ వేటు

నేరగాళ్ల సంస్థ అని మస్క్‌ ఆరోపణలు

ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్‌ జడ్జి అనుమతించిన తర్వాతే ట్రంప్‌ యంత్రాంగం ఈ విషయంలో ముందుకెళ్లింది. ప్రభుత్వ ప్రణాళికను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని యూఎస్‌ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల నికోలస్ తిరస్కరించారు. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించడానికి పనిచేస్తున్న మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ ఇప్పటికే అనేకమంది యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసింది. తాజాగా తీసుకొన్న ఈ నిర్ణయం మిగిలిన ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది. అయితే యుఎస్‌ఎయిడ్‌ ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని మస్క్‌ ఇప్పటికే ఆరోపణలు చేశారు.

తన చర్యలను సమర్థించుకున్న ట్రంప్‌

అందుకే నిధులను ఆపేస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులోభాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఈ ఆదేశాలపై ఫెడరల్‌ జడ్జి అమీర్‌ అలీ గతవారం తాత్కాలికంగా స్టే ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు యూఎస్‌ఎయిడ్‌ ద్వారా సాయం అందించడానికి ఆమోదం తెలిపినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా నిలిపేయగలదని జడ్జి నిలదీశారు. అయినా ట్రంప్‌ తన చర్యలను సమర్థించుకుంటున్నారు. యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా భారత్‌లో జరిగిన ఎన్నికలలో పోలింగ్‌ శాతం పెంచడానికి అమెరికా ప్రభుత్వం రూ.182 కోట్లు ఇచ్చిందని ట్రంప్‌ పలుమార్లు ఆరోపణలు చేశారు.

ప్రపంచం మీద ప్రభావం:

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సహాయ కార్యక్రమాలకు తీవ్ర ప్రభావం చూపించవచ్చు. యూఎస్‌ఎయిడ్‌ గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందని దేశాలకు మానవతా సహాయం, ప్రకృతి వైపరీత్యాల రక్షణ, అభివృద్ధి ప్రాజెక్టులు వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించింది. ఉద్యోగుల తొలగింపు మరియు నిధుల నిలిపివేతతో ఈ సహాయ కార్యక్రమాలు తీవ్రంగా ప్రభావితం కావచ్చు.

ప్రపంచ దేశాలతో సంబంధాలు:

అమెరికా ప్రభుత్వం యూఎస్‌ఎయిడ్ ద్వారా మద్దతు ఇచ్చిన దేశాలు ఈ నిర్ణయం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో ఈ నిర్ణయం మరింత ప్రభావం చూపిస్తుంది. ట్రంప్ ఆదేశాల ప్రకారం, మిగిలిన దేశాలలో కొంతమంది ఉద్యోగులను మాత్రమే కొనసాగించటం, మరికొంతమందిని సెలవుపై పంపడం ద్వారా మిగిలిన కార్యాలయ కార్యకలాపాలు కుదటపడే అవకాశం ఉంది.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online trump USAID workers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.