భారత ఆర్ధికవృద్ధిపై ప్రశంసలు కురిపించిన అధ్యక్షుడు పుతిన్‌

Read Time:  1 min
President Putin praised Indias economic growth
President Putin praised Indias economic growth
FONT SIZE
GET APP

న్యూఢిల్లీ: రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ఆర్థిక వృద్ధిని ప్రశంసించారు. భారత్ అనేక బ్రిక్స్ దేశాలకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నట్టు చెప్పారు. సదస్సుకు హాజరైనందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

“మనం ఆర్థిక వృద్ధిని పెంపొందించేందుకు అవసరమైన అంశాలపై చర్చిస్తున్నాము. మీరు ఈ విషయంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్నారని మోడీని ఉద్దేశించి పుతిన్ పేర్కొన్నారు. 7.5 శాతం వృద్ధి రేటుతో మీరు అందించిన ఫలితాలకు మాకు అభినందనలు ఉన్నాయి. ఇది అందరికీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది” అని చెప్పారు. మోడీ తీసుకున్న చర్యలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7 శాతం, వచ్చే ఏడాది 6.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.