📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

భారత్, చైనాలో చమురు ధరల పెంపు?

Author Icon By Vanipushpa
Updated: January 13, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్-రష్యా దేశాలమధ్య జరుగుతున్న యుద్ధం వల్ల భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దీనితో ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్, చైనాలో చమురు ధరలు పెంచే అవకాశాలున్నాయి.
అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా విషయంలో భారత్ ఎంత తటస్థ వైఖరి అవలంబిస్తున్నా అంతర్జాతీయంగా వారిద్దరి మధ్య సాగే పోరు ప్రభావం మాత్రం మనపై పడుతూనే ఉంది. తాజాగా రష్యా చమురు ఉత్పత్తిదారులు, నౌకలపై అమెరికా విధించిన భారీ ఆంక్షలు భారత్ తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి.
ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభించి ఏడాది దాటిపోయినా ఫలితం రాబట్టుకోలేకపోవడం రష్యాకు శాపంగా మారింది. ముఖ్యంగా ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న అమెరికా, నాటో దేశాల్ని ఎదిరించి ఈ యుద్ధం గెలవడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. అయితే భారత్ మాత్రం ఇవేవీ లెక్కచేయకుండా మిత్రదేశమైన రష్యా వద్ద రాయితీతో మరీ చమురు కొంటోంది. చైనా పరిస్ధితి కూడా ఇదే. దీంతో అమెరికా ఈసారి గట్టిగా కొరడా ఝళిపించింది.

రష్యా చమురు ఉత్పత్తి సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇప్పుడు భారత్, చైనా వారి నుంచి చమురు కొనే పరిస్ధితి లేకుండా పోతోంది. దీంతో ఈ రెండు దేశాలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికాల నుండి మరింత చమురును కొనాల్సిన పరిస్ధితి. ఈ పరిణామం సహజంగానే చమురు ధరలు, సరుకు రవాణా ఖర్చులను పెంచుతాయి. దీంతో భారత్, చైనా అంతర్గతంగా చమురు ధరల పెంపుకు సిద్ధం కావాల్సిందే.

పాశ్చాత్య ఆంక్షలు, 2022లో గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ విధించిన ధరల పరిమితి వల్ల భారత్, చైనాకు చమురు రవాణా చేయడానికి అనేక ట్యాంకర్లు వాడుకున్నారు. అలాగే రష్యా చమురు వాణిజ్యాన్ని యూరప్ నుండి ఆసియాకు మార్చింది. కొన్ని ట్యాంకర్లు ఇరాన్ నుండి చమురును కూడా రవాణా చేశాయి. ఇప్పుడు ఇవన్నీ ఆంక్షల పరిధిలోకి వచ్చేశాయి.

indian and china Oil price hike war

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.