గ్యాస్ స్టేషన్‌లో పేలుడు..15 మంది మృతి

Read Time:  1 min
Explosion at a gas station in Yemen.. 15 people died
Explosion at a gas station in Yemen.. 15 people died
FONT SIZE
GET APP

యెమెన్​ : యెమెన్‌లోని ఒక గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు కనీసం 15 మంది మృతి చెందారు. బయ్దా ప్రావిన్స్‌లోని జహెర్ జిల్లాలో ఈ పేలుడు జరిగిందని హౌతీ తిరుగుబాటుదారుల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో చెప్పింది. ఆ ప్రకటన ప్రకారం, కనీసం 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

image
image

గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు వెదుకులాట ప్రారంభించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పేలుడుకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆన్‌లైన్‌లో ప్రసారమైన ఫుటేజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మంటల కారణంగా వాహనాలు బూడిదయ్యాయి, ఆకాశంలో పొగ మేఘాలు దట్టంగా పైకి లేచాయి.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో గ్యాస్ స్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య హింస కొనసాగుతోంది. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హౌతీలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు. ఇంతలో, ఇద్దరి మధ్య ఉద్రిక్తత ఎంతగా పెరిగిందంటే, ఇద్దరూ ఒకరిపై ఒకరు నేరుగా దాడులకు దిగుతున్నారు.

హౌతీలు ఇజ్రాయెల్ పై హైపర్ సోనిక్ క్షిపణితో దాడి చేశారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్, హౌతీ తిరుగుబాటుదారులు సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేశారు. ఈ దాడికి ప్రతిస్పందనగా, హౌతీలు ఇజ్రాయెల్‌పై ఒకదాని తర్వాత ఒకటి అనేక పెద్ద దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని అనేక విమానాశ్రయాలు ధ్వంసమయ్యాయి.రన్‌వేలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్, హౌతీల మధ్య హింస ఇంకా కొనసాగుతోంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.