Inter exams start from today

నేటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం

నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ..!

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్ణీత తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను 30 నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్లు మూసివేసారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. కాగా జనరల్‌, ఓకేషనల్‌ కలిపి మొత్తం 26,161 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 12,936 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 13,225 మంది ఉన్నారు.

Advertisements
 నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

సెల్‌ఫోన్‌లు, ఇతరత్రా ఎలకా్ట్రనిక్‌ పరికరాలపై ఆంక్షలు

పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, ఇతరత్రా ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించరు. కేంద్రాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది కూడా సెల్‌ఫోన్‌లను పరీక్ష కేంద్రాల ప్రాంగణంలో వినియోగించకుండా ఆంక్షలు విధించారు. పరీక్ష కేంద్ర చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంట్‌ ఆఫీసరు మాత్రమే ఇంటర్‌ బోర్డు అందించిన కీప్యాడ్‌ సెల్‌ఫోన్‌ను వినియోగించాలి. ఇంటర్మీడియట్‌ రాత పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి పోలీస్‌ అధికారులు నిర్వహించాల్సిన విధుల గురించి ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అంతా అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. విద్యార్థులను సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలతో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్న జెరాక్స్‌ షాపులను మూసివేయించాలన్నారు.

Related Posts
తెలంగాణ మహిళా కమిషన్‌కు వేణుస్వామి క్షమాపణలు
Venuswamy apologizes to Telangana Women Commission

హైదరాబాద్‌: జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు. Read more

ఏపీలోని ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ
ఏపీలోని ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ

ఏపీలోని ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదు స్థానాల్లో ఒకదానిపై స్పష్టత వచ్చింది. జనసేన Read more

ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
Cancer cases on the rise in

ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా ఉన్నట్లు ప్రభుత్వ స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన Read more

Ramzan: ఆంధ్రాలో ఇఫ్తార్ విందుల్ని బహిష్కరించిన ముస్లింలు.. ఎందుకంటే?
Ramzan: ఆంధ్రాలో ఇఫ్తార్ విందుల్ని బహిష్కరించిన ముస్లింలు.. ఎందుకంటే?

పార్లమెంట్‌లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఇప్పటికే రంజాన్ మాసంలో ముస్లింలకు ఇచ్చే ఇఫ్తార్ విందులను బహిష్కరించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. బీహార్, ఆంధ్రప్రదేశ్ Read more

Advertisements
×