పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్–పాక్ సంబంధాలు మరోసారి ఉద్రిక్తతతో నిండిపోయాయి. దాయాది దేశంపై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దానికి ప్రతిస్పందనగా పాక్ కూడా ఆంక్షల దారిలోకి వెళ్లింది.ఇందులో భాగంగా పాకిస్థాన్, భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. మన దేశ విమానాలు తమ గగనతలపైకి రావద్దని స్పష్టం చేసింది. దీనికి ప్రతీకారంగా భారత్ కీలక చర్యలు చేపట్టే దిశగా కదులుతోంది.తాజా సమాచారం మేరకు, భారత ప్రభుత్వం పాక్ ఎయిర్లైన్లపై గగనతల నిషేధం విధించే ఆలోచనలో ఉంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.మొదటగా ఏ నిర్ణయమూ తీసుకోలేదన్నా, భారత నిర్ణయం పాక్కు తీవ్రమైన దెబ్బవేస్తుందని నిపుణుల అభిప్రాయం.

ఎందుకంటే పాక్ విమానయాన సంస్థలు చాలా దేశాలకు భారత గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.ఇందులో ముఖ్యంగా సింగపూర్, మలేసియా, థాయ్లాండ్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు భారత్ గగనతలాన్ని మూస్తే, విమానాలు చైనా లేదా శ్రీలంక మీదుగా మళ్లించాల్సి ఉంటుంది.ఇలా మారితే ప్రయాణ సమయం పెరుగుతుంది. నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పాక్ విమానయాన సంస్థలకు ఇది కుదలని పరిస్థితి.ఇక, భారత విమానాలపై నిషేధం విధించిన పాక్ కూడా ఇప్పటికే నష్టాలు ఎదుర్కొంటోంది. వారానికి సగటున 800 అంతర్జాతీయ విమానాలు పాక్ గగనతలం మీదుగా వెళ్తున్నాయి.ఈ మార్గం వాడిన ప్రతి విమానానికి పాక్ ఓవర్ఫ్లైట్ ఫీజు వసూలు చేస్తుంది. దాదాపు రోజుకి 1.2 లక్షల డాలర్లు ఆదాయం వస్తోంది. ఇప్పుడు ఆ మొత్తం పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చింది.ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది భారత్ కంటే పాక్గానే ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. విమానయాన రంగంలో ఇప్పటికే వెనుకబడిన పాక్కు ఇది మరింత గండిగా మారే అవకాశం ఉంది.భారత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే, పాక్ ఎయిర్లైన్స్కు ఇది పెద్ద అడ్డంకి అవుతుంది. ప్రయాణ మార్గాలు మారటంతో ప్రయాణికులపై కూడా ప్రభావం పడుతుంది.
Read Also : Canada Election: ట్రంప్ కు వ్యతిరేక భావాలే మార్క్ కార్నీవిజయానికి నాంది?