మలేషియాలో భద్రాచలం పేరు ఇప్పుడు మంచి పేరుతో మార్మోగిపోతోంది.దీని కారణం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఈ ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష అండర్ 19 మహిళల ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చూపించి భారత్ను విజేతగా నిలిపింది.ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను భారత్ జట్టు గెలిచింది.ఆదివారం (ఫిబ్రవరి 2) జరిగిన ఫైనల్లో భారత మహిళలు 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 11.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. ఇదే సమయంలో, అండర్ 19 మహిళల టీ20 క్రికెట్లో భారత్ రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది.

టోర్నీ ప్రారంభం నుండి అద్భుతమైన ఆల్-రౌండ్ ప్రదర్శనతో మెరిపించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫైనల్లోనూ తన ప్రతిభను చూపించింది. మొదట తన స్పిన్ బౌలింగ్తో దక్షిణాఫ్రికాను కట్టడి చేసింది.4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టింది. తర్వాత, లక్ష్య ఛేదనలో కూడా ఆమె చెలరేగిపోయింది.దక్షిణాఫ్రికా బౌలర్లకు ఏ అవకాశం కూడా ఇవ్వకుండా బౌండరీలతో తేరుకుంది. 33 బంతుల్లో 8 ఫోర్లతో 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.దీనితో, భారత్ విజయాన్ని సాదించింది. అందువల్ల, గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకుంది. ఈ టోర్నీలో ఆమె ప్రదర్శన మరెప్పటికీ గుర్తుండిపోతుంది.