భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నేడు కోల్కతాలో మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టును సమతూకంగా ఉండేలా బౌలర్లు, ఆల్రౌండర్లతో ఎంపిక చేశారు. ఆసక్తికరంగా, పేసర్ గస్ అట్కిన్సన్ సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చాడు. అతను చివరిసారిగా 2023 డిసెంబర్లో వెస్టిండీస్తో ఆడాడు. జట్టులో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆదిల్ రషీద్ను ఎంపిక చేయడం విశేషం.ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాక్ బాథెల్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా అర్చర్, ఆదిల్ రషీద్, మార్క్వుడ్.ఇంగ్లండ్ తన గత టీ20 సిరీస్ను వెస్టిండీస్తో ఆడగా, 3-1తో విజయాన్ని సాధించింది, భారత్ తన చివరి సిరీస్లో సౌతాఫ్రికాను 3-1తో ఓడించింది.

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్లు జరిగాయి.ఇందులో ఇంగ్లండ్ 11 మ్యాచ్ల్లో విజయం సాధించగా, భారత గడ్డపై ఆడిన 11 మ్యాచ్ల్లో ఐదు సార్లు గెలిచింది.మడమ నొప్పితో ఏడాది కాలంగా దూరమైన మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్ సంజు శాంసన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన నితీశ్ రెడ్డికి టీ20 జట్టులో స్థానం లభించింది.భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ నేడు కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. తదుపరి మ్యాచ్లు 25న చెన్నై, 28న రాజ్కోట్, 31న పూణే, ఫిబ్రవరి 2న ముంబైలో నిర్వహించబడతాయి. టీ20 సిరీస్ అనంతరం మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్పూర్లో, రెండో వన్డే 9న కటక్లో, చివరిది 12న అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు.ఈ సిరీస్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇరు జట్ల బలబలాలు తేల్చే ఈ పోరాటం ఉత్కంఠభరితంగా సాగనుంది.