బీజీంగ్: ఆసియా దిగ్గజం చైనాపై పరస్పర సుంకాలు విధిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేసారు. అమెరికా వాణిజ్య యుద్ధం చేయడానికి నిశ్చయించుకుంటే మేం మాత్రం ఎందుకు తలొగ్గుతాం.. చివరి వరకు పోరాడటానికి మేం కూడా సిద్ధంగా ఉన్నామని చైనా తేల్చి చెప్పింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, చైనా దిగుమతులపై సుంకాలను పెంచడానికి అమెరికా ఫెంటానిల్ను చిన్న సాకుగా ఉపయోగిస్తోందని X పోస్ట్లో పేర్కొన్నారు. యుద్ధాన్ని అమెరికా కోరుకుంటే, అది సుంకాల యుద్ధం అయినా, వాణిజ్య యుద్ధం అయినా లేదా మరే రకమైన యుద్ధం అయినా, మేము చివరి వరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము” అని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

సుంకాల పెంపుతో చైనాపై ఒత్తిడి
ఔషధంఫెంటానిల్ ఉత్పత్తిలో ఉపయోగించే రసాయనాల ఎగుమతిని ఆపడంలో చైనా విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. సుంకాల పెంపుతో చైనాపై ఒత్తిడి తెచ్చి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. వారికి సహాయం చేసినందుకు వారు మమ్మల్ని శిక్షిస్తున్నారు అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బెదిరింపులు మమ్మల్ని భయపెట్టవు. బెదిరింపులు మాపై పనిచేయవు. చైనాతో వ్యవహరించడానికి ఒత్తిడి, బలవంతం లేదా బెదిరింపులు సరైన మార్గం కాదు.
10%-15% వరకు టైట్-ఫర్-టాట్ సుంకాలు
చైనాపై గరిష్ట ఒత్తిడిని ఉపయోగించే ఎవరైనా తప్పు వ్యక్తిని ఎంచుకుని తప్పుగా లెక్కలు వేస్తున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దాంతో చైనా అమెరికాపై దూషణలకు దిగింది. అమెరికా ఇప్పటికే అన్ని చైనా దిగుమతులపై సుంకాన్ని 10% నుండి 20%కి రెట్టింపు చేసింది. అమెరికా చర్యకు చైనా వేగంగా స్పందించి, గోధుమ, మొక్కజొన్న, పత్తి వంటి అమెరికన్ వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై 10%-15% వరకు టైట్-ఫర్-టాట్ సుంకాలను ప్రకటించింది. అదనంగా, చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ భద్రతా కారణాల దృష్ట్యా 25 అమెరికన్ కంపెనీలను ఎగుమతి మరియు పెట్టుబడి పరిమితుల క్రింద ఉంచింది.