ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) బుధవారం తిరుపతిలో సందడి చేశారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర (Golden Andhra–Clean Andhra) కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి కీలకంగా మాట్లాడారు. సొసైటీ క్లీన్ కావాలంటే రాజకీయాలూ శుభ్రం కావాలి, అన్నారు.చంద్రబాబు మాట్లాడుతూ – చెత్తని ఊడ్చినట్టు, నేర రాజకీయాల్ని తొలగించాలి, అన్నారు. పేపర్ పేరిట ప్రజలను మోసగించారు. నన్ను గుండెపోటుతో చనిపోయాడంటూ వార్తలు పెట్టారు. కానీ ప్రజలు నిజం గుర్తించారు. మళ్లీ మోసపోవద్దు, అంటూ ప్రజలకు సందేశం ఇచ్చారు.

మామిడి పండ్లతో డ్రామా? పులివెందుల రాజకీయం!
బంగారుపాళ్యంలో మామిడి రైతులకు మద్దతుగా రూ.12,000 రేటు ఖరారు చేశాం. అయినా రోడ్లపై పండ్లు పోసి హడావుడి చేస్తున్నారు. ఇది పచ్చి రాజకీయ నాటకం, అన్నారు. నాకు హింసా రాజకీయాల కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం, అన్నారు సీఎం.హంద్రినీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ మొదలైనవి మా పార్టీ ఫలితమే, అన్నారు చంద్రబాబు. తిరుపతికి నీరు, గరుడ వంతెన, అవిలాల చెరువు—all done by us, అన్నారు.“హంద్రినీవా నీరు త్వరలో వెంకన్న దరికి వస్తుంది,” అని హామీ ఇచ్చారు. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్, స్వర్ణముఖి లింక్ వంటి ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు.
పీ4తో పేదరికం పాకకుండా చూస్తా
“2029 నాటికి పేదరికం లేని ఏపీ మన లక్ష్యం, అన్నారు సీఎం. పీ4 కార్యక్రమం ద్వారా 20 లక్షల కుటుంబాలను అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. పిల్లల భవిష్యత్తు నాకు బాధ్యత. వారిని ముందుకు నడిపించాలి. వారే దేశానికి దీపస్తంభంగా మారతారు, అని విశ్వాసం వ్యక్తం చేశారు.నిన్నే 40 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యాను. వారు వేల కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు, అన్నారు చంద్రబాబు.
Read Also : Chandrababu : పిల్లల్ని చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి: చంద్రబాబు