I am not a terrorist, I am a politician.. Malik

Yasin Malik : నేను ఉగ్రవాదిని కాదు..రాజకీయ నాయకుడిని: మాలిక్‌

Yasin Malik: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుప్రీం కోర్టు విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఉగ్రవాది అంటూ సీబీఐ చేసిన ఆరోపణలను మాలిక్‌ తోసిపుచ్చాడు. తాను రాజకీయ నాయకుడినని.. ఉగ్రవాదిని కాదని యాసిన్‌ మాలిక్‌ పేర్కొన్నాడు. గతంలో తనతో ఏడుగురు ప్రధానులు చర్చలు జరిపారని వెల్లడించాడు. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-యాసిన్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందే తప్ప ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చలేదని అన్నాడు.

Advertisements
నేను ఉగ్రవాదిని కాదు రాజకీయ

35 ఏళ్ల నాటి ఉగ్రవాద కేసుల విచారణను తిరిగి ప్రారంభించారు

1994లో తనకు 32 కేసులలో బెయిల్ ఇచ్చారని.. కేసులను కూడా కొనసాగించలేదని గుర్తు చేసుకున్నాడు. గతంలో ప్రధానులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ హయాంలోనూ తన సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్లలోనూ మునుపటి విధానాన్నే అనుసరించారని.. కానీ, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా 35 ఏళ్ల నాటి ఉగ్రవాద కేసుల విచారణను తిరిగి ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

మాలిక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు

1989లో జమ్మూలో అతడిపై నమోదైన రెండు కేసుల్లో విచారించడానికి మాలిక్‌ను అక్కడి కోర్టులో హాజరుపరచాలని అధికారులు చేసిన ప్రతిపాదనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ఆ కేసులకు సంబంధించిన విచారణను జమ్ము కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని కోరింది. మాలిక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నందున అక్కడికి వెళ్తే.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని సీబీఐ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు విన్నవించారు. ఈ క్రమంలో మాలిక్‌ మాట్లాడుతూ..తానేమీ ఉగ్రవాదిని కాదంటూ వ్యాఖ్యానించాడు.

Related Posts
Bhattacharya: శాస్త్రవేత్త జే భట్టాచార్య NIH డైరెక్టర్‌గా నియమితం
శాస్త్రవేత్త జే భట్టాచార్య NIH డైరెక్టర్‌గా నియమితం

అమెరికాలోని ప్రముఖ ఆరోగ్య పరిశోధనా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) డైరెక్టర్‌గా భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ జే భట్టాచార్య నియమితులయ్యారు. ఆయన నియామతను US Read more

వైసీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహంలో జగన్ సందడి
jagan attend at tanniru nag

మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి..జగయ్యపేట వైసీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహంలో సందడి చేసాడు. విజయవాడలోని పోరంకి మురళీ రిసార్ట్స్ Read more

MadhyaPradesh :ఆ గ్రామమంతా ఫుట్ బాల్ ఆటగాళ్లే.. ఎక్కడంటే!
MadhyaPradesh :ఆ గ్రామమంతా ఫుట్ బాల్ ఆటగాళ్లే.. ఎక్కడంటే!

భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఏమిటో అందరికీ తెలిసిందే. కానీ, మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లా విచార్‌పుర్ గ్రామం మాత్రం ఫుట్ బాల్‌ను జీవితంగా భావించే ఒక ప్రత్యేకమైన Read more

దొంగగా మారిన సమాజ్‌వాదీ పార్టీ నేత
Samajwadi Party leader turn

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్‌పై విద్యుత్ దొంగతనానికి సంబంధించి రూ. 54 లక్షల జరిమానా విధించినట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×