📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Godavari- డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2, 3కు శ్రీకారం – రూ.7,360 కోట్ల వ్యయం

Author Icon By Pooja
Updated: September 8, 2025 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Godavari-హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు మూసీ నదిని పునరుజ్జీవనం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రూ.7,360 కోట్ల వ్యయంతో గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్ 2, 3 పనులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు హమ్ విధానంలో అమలు చేయబడుతుంది. ఇందులో ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టగా, కాంట్రాక్టు కంపెనీ 60% నిధులను సమకూరుస్తుంది.

మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసిల నీటి వినియోగం

ప్రస్తుతం నగరానికి రోజుకు 580 నుండి 600 ఎంజిడిల నీరు సరఫరా అవుతుంది. 2027 నాటికి ఈ డిమాండ్ 835 ఎంజిడిలకు, 2047 నాటికి 1114 ఎంజిడిలకు పెరిగే అవకాశం ఉంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అదనంగా 300 ఎంజిడిల నీటిని సరఫరా చేయడానికి ఫేజ్ 2, 3 ప్రాజెక్టు రూపకల్పన చేశారు. గోదావరి నది నుంచి 30 టీఎంసిల నీటిని ఉపయోగించే అవకాశం ఉండటంతో, మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా 20 టీఎంసిల నీరు తరలించనున్నారు. ఇందులో 17.5 టీఎంసిలు తాగునీటి కోసం, మిగతా 2.5 టీఎంసిలు మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవన కోసం వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టు కింద ఘనపూర్ వరకు 3000 ఎంఎం డయామీటర్ భారీ పైప్‌లైన్ నిర్మించనున్నారు. అదేవిధంగా ఘనపూర్, షామీర్పేట్ వద్ద 1170 ఎంఎల్ సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (WTP) ఏర్పాటు చేయనున్నారు. మన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణం కూడా చేపడుతున్నారు.

రెండు ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి లక్ష్యం

ప్రాజెక్టును వచ్చే రెండు ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 2027 నాటికి నగరానికి ప్రతిరోజూ తగినంత నల్లా నీరు అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టు కింద జిహెచ్ఎంసి, ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలకు తాగునీరు అందుతుంది. రూ.1200 కోట్ల వ్యయంతో 71 రిజర్వాయర్లు నిర్మిస్తారు. వీటిలో ఇటీవల పూర్తి చేసిన 15 రిజర్వాయర్లను(Reservation) త్వరలో ప్రారంభించనున్నారు. అదే సమయంలో కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన జరగనుంది. రూ.298 కోట్ల వ్యయంతో అమలు చేసే ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సరఫరాతో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా 13 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారు.

గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2, 3 ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
హైదరాబాద్ ప్రజలకు అదనపు తాగునీటి సరఫరా చేయడం, అలాగే మూసీ ప్రక్షాళనకు సహకరించడం.

ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత?
రూ.7,360 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-nara-lokesh-minister-nara-lokesh-visit-to-karnataka/titles/trip/542945/

Godavari drinking water project Google News in Telugu Hyderabad Moosi cleaning Hyderabad Water Supply Latest News in Telugu Phase 2 and 3 Godavari project telangana water projects Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.