📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Prasad Kumar: ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ

Author Icon By Sushmitha
Updated: November 20, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ (Prasad Kumar) విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా, మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణ దాదాపు తుది అంకానికి చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత అంశం తేల్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read Also: YSRCP: విశాఖ ఉక్కు పై వైఎస్సార్సీ ఫేక్ ప్రచారం: మంత్రి సుభాష్

Prasad Kumar Speedy investigation into the disqualification of MLAs

తుది మౌఖిక విచారణ

స్పీకర్ బుధవారం నాడు విచారణలో ముగింపు దశలో నిర్వహించే మౌఖిక (వైవా) విచారణను చేపట్టారు. ఈ విచారణ అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో జరిగింది.

గురువారంతో ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ ముగియనున్నది. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల వివరణలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

సుప్రీంకోర్టు ఆదేశాలు, ఉత్కంఠ

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను నాలుగు వారాల్లో ముగించి, నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశించింది. దీంతో రాబోయే నెల రోజుల్లోగా స్పీకర్ తన తుది తీర్పును వెలువరించే అవకాశాలున్నాయి. స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. విచారణ సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anti-Defection Law Google News in Telugu Latest News in Telugu MLA Disqualification political controversy. Prasad Kumar Supreme Court order Telangana Speaker G Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.