హైదరాబాద్ (సైఫాబాద్) : కళాశాలల బంద్ విరమణ సందర్బంగా ప్రభుత్వం చర్చలు జరిపి కేవలం 600 కోట్లు బడ్జెట్ విడుదల చేస్తామనడం సరికాదని, 8 వేల కోట్లు బకాయిలు ఉంటే, 600 కోట్లు ఏ మూలకు సరిపోతాయని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య (MPR. Krishnaiah) ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక్కొక్క కాంట్రాక్టర్కు 6, 7 కోట్లు ఏక కాలంలో చెల్లిస్తూ, చదువుకునే 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలు 8 వేల కోట్లు ఇవ్వడానికి అవరోధం ఏమిటని ఆయన నిలదీశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ నీల వెంకటేశ్, (Neela Venkatesh) బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ అధ్యక్షత జరిగిన మీడియా సమావేశంలో ఆర్.కృష్ణయ్య (MPR. Krishnaiah) ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఆనేక ఇతర పథకాలకు ఉదారంగా బడ్జెట్ కేటాయిస్తూ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పథకాలకు బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు.
MPR. Krishnaiah
ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు
ఫీజుల బడ్జెట్ చెల్లించకపోతే రాష్ట్రంలో యుద్ధమే కొనసాగుతుందని, దసరా తరువాత విన్నూత పద్ధతిలో ఆందోళనలు కొన సాగిస్తామని, బడ్జెట్ విడుదల చేసేంతవరకు ఉద్యమాలు ప్రతిరోజు కొనసాగుతాయని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. 22 నెలల క్రితం అధికారంలోకి వచ్చన కాంగ్రెస్ (congress) ప్రభుత్వం విద్యార్థులకు 20 రూపాయలు కూడా విడుదల చేయలేదని, ఈ పథకం అమలుకు నాలుగు శాఖల ద్వారా బడ్జెట్లో 5 వేల కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి కూడా విడుదల చేయ లేదని, కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ, ఎస్టీలకు వీటిని ఎం పథకం కింద వేల కోట్లు కేటాయిస్తున్నదని, చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ఈ సమావేశంలో బిసి నాయకులు మణికంఠ, (Manikanta) రాందేవ్ మోదీ, రవియాదవ్, నిఖిల్ పటేల్, లీలా తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుగా ఎంత మొత్తం చెల్లించాల్సి ఉందని ఆర్.కృష్ణయ్య చెప్పారు?
సుమారు రూ.8 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వం చర్చల తర్వాత ఎంత మొత్తం విడుదల చేస్తామని తెలిపిందని ఆర్.కృష్ణయ్య విమర్శించారు?
కేవలం రూ.600 కోట్లు విడుదల చేస్తామని తెలిపిందని విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: