హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ (GGH) జెరియాట్రిక్ సేవలు (Geriatric services) (వృద్ధాప్య చికిత్స) అందించాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. హైదరాబాద్లోని (Hyderabad) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఈ సమీక్షలో మంత్రి పాల్గొన్నారు.
Read Also: Mahesh Babu: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్

ఆరోగ్య వ్యవస్థలో మార్పులు, జెరియాట్రిక్ కేర్
జీవన ప్రమాణాలు పెరగడం వల్ల వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి దామోదర్ (Minister Rajanarsimha)పేర్కొన్నారు. పిల్లల కోసం ‘చైల్డ్ హెల్త్ కేర్ (Child Health Care) సెంటర్లు’ నిర్వహిస్తున్నట్లుగానే, జపాన్, ఇటలీ తరహాలో భవిష్యత్తులో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
- సేవల విస్తరణ: వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని ఆయన ఆదేశించారు.
- అవగాహన: ప్రతి జీజీహెచ్, జిల్లా ఆసుపత్రిలో ఇప్పటికే జెరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేశామన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
- నియామకాలు: ఈ రెండేళ్లలో 9 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకు పైగా పోస్టులు భర్తీ అవుతున్నాయని మంత్రి తెలిపారు. సిబ్బంది హాజరును తాము నిరంతరం మానిటర్ చేస్తున్నామని చెప్పారు.
జీవనశైలి వ్యాధులు, ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు
ఒకప్పుడు కమ్యూనికెబుల్ డిసీజెస్ (అంటు వ్యాధులు) ఎక్కువగా ఉండగా, ఇప్పుడు నాన్-కమ్యూనికెబుల్ డిసీజెస్ (జీవనశైలి వ్యాధులు) ఎక్కువయ్యాయని మంత్రి అన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె, కిడ్నీ జబ్బుల వంటి లైఫ్స్టైల్ డిసీజ్లకు మెరుగైన ట్రీట్మెంట్ అందించే విధంగా హాస్పిటళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో ఎన్సీడీ క్లినిక్లు, డేకేర్ క్యాన్సర్ సెంటర్లు, ఐవీఎఫ్ సెంటర్లు ప్రారంభించుకున్నామని, ఇప్పుడు జెరియాట్రిక్ సేవలను విస్తరిస్తున్నామని చెప్పారు.
ట్రీట్మెంట్ (Treatment) పేరుతో ప్రజలను దోచుకునే ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించినా, మంచిగా పని చేయని వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్లూ, డీఎంఈ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: