📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Telugu news: Mallareddy: దేశవ్యాప్తంగా విద్యా సంస్థల విస్తరణకు మల్లారెడ్డి సన్నాహాలు

Author Icon By Pooja
Updated: November 4, 2025 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో, విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లారెడ్డి,(Mallareddy) ఇప్పుడు తన విద్యా సంస్థల సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు(Medical Colleges), డీమ్డ్ యూనివర్శిటీలు, పాఠశాలలను విజయవంతంగా నడుపుతున్న ఆయన, ఆ మోడల్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకుంటున్నారు.

Read Also: CM: లండన్‌లో కీలక ఒప్పందం – హిందుజా గ్రూప్‌తో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు

Mallareddy

తాజాగా మల్లారెడ్డి(Mallareddy) కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తిరుపతిలో ఒక ఇంజినీరింగ్ కాలేజీని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే విశాఖపట్నంలోనూ ఒక విద్యాసంస్థను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. తిరుపతిలో కాలేజీ కొనుగోలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీలు స్థాపించడం తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

పేదలకు విద్య, వైద్య సేవలందించడమే లక్ష్యం
మల్లారెడ్డి మాట్లాడుతూ, తాను ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో విద్యాసంస్థలు, ఆసుపత్రులు నడపాలని సంకల్పించానని చెప్పారు. విద్యా, వైద్య రంగాల ద్వారా పేదలకు నాణ్యమైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీలో తిరుపతి, విశాఖతో ప్రారంభించిన ఈ విస్తరణ త్వరలోనే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనుందని ఆయన వెల్లడించారు.

“మల్లారెడ్డి బ్రాండ్” దేశవ్యాప్తం వైపు
తన ప్రత్యేక శైలితో, పంచ్ డైలాగ్‌లతో ప్రజల్లో విపరీతమైన ప్రజాదరణ పొందిన మల్లారెడ్డి, ఇప్పుడు “మల్లారెడ్డి బ్రాండ్”ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తిరుపతిలో కొనుగోలు చేసిన కొత్త కాలేజీతో పాటు, మూసివేసిన సంస్థలను పునరుద్ధరించి, కొత్తగా మరిన్ని యూనివర్సిటీలు స్థాపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com

Read Also:

Latest News in Telugu Mallareddy Colleges Telangana politics Tirupati College Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.