తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ కేపీహెచ్బీ (KPHB Crime) పోలీస్ స్టేషన్ పరిధిలో మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లికి చెందిన అనిత, ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వచ్చి ప్రైవేటు ఉద్యోగంలో చేరింది.
Read Also: Nepal Bus Accident: పెళ్లి బస్సు ప్రమాదం.. 8 మంది మృతి?
కేసు నమోదు
అయితే, గత కొంతకాలంగా ఆమె కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏర్పడిన మానసిక ఒత్తిడి తట్టుకోలేక, తీవ్ర నిరాశతో భవనం మూడో అంతస్తు నుంచి దూకేసిందని ప్రాథమిక సమాచారం. కిందపడటంతో తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేపీహెచ్బీ (KPHB Crime) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆరోగ్య సమస్యల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఇతర వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: