Hyderabad Metro: మారుతున్న కాలానికి అనుగుణంగా హైదరాబాద్ నగరం మరో టెక్నాలజీ ఆవిష్కరణకు వేదికైంది. సాధారణంగా ఏదైనా డాక్యుమెంట్ ప్రింట్ తీసుకోవాలంటే జిరాక్స్ దుకాణాల కోసం వెతకడం, అక్కడ క్యూలో నిలబడటం వంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, మనిషితో సంబంధం లేకుండా నేరుగా ప్రింట్ తీసుకునే అత్యాధునిక కియోస్క్ (Printing Kiosk) నగరంలో అందుబాటులోకి వచ్చింది. భాగ్యనగర వాసుల జీవనశైలిని మరింత సులభతరం చేస్తూ ఈ కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు.
Read Also: Kondigari Ramulu: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే రాములు కన్నుమూత
కూకట్పల్లి మెట్రో స్టేషన్లో ‘వికీ ప్రింట్’ ప్రారంభం
హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే కూకట్పల్లి మెట్రో స్టేషన్లో ‘వికీ ప్రింట్’ (Wiki Print) పేరుతో ఈ సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ కియోస్క్ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, అత్యవసరంగా ప్రింటౌట్లు అవసరమయ్యే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. షాపు యజమానితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా, కేవలం మీ స్మార్ట్ఫోన్ ద్వారా నిమిషాల్లోనే డాక్యుమెంట్లను ప్రింట్ తీసుకోవచ్చు.
అప్పుడు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.. కలర్ ప్రింట్ కావాలా, బ్లాక్అండ్వైట్ కావాలా, ఎన్ని ప్రింట్లు కావాలి అని అడుగుతుంది. ఆ ఆప్షన్స్ సెలక్ట్ చేసి టిక్ పెట్టగానే యూపీఐ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఎంత డబ్బు చెల్లించాలో ఉంటుంది. యూపీఐ పేమెంట్ ద్వారా డబ్బు చెల్లించిన తర్వాత మనం ఇచ్చిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది.
దానిని ఎంటర్ చేయగానే మెషిన్ నుంచి వరుసగా ప్రింట్లు వచ్చేస్తాయి. ఈ సరికొత్త మెషిన్ గురించి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. జెరాక్స్ షాపులకు వెళ్లకుండా ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. మొత్తానికి హైదరాబాద్లో ఉండేవారికి క్విక్ ప్రింట్ సాయంతో ఈజీగా ప్రింట్ తీసుకునే అవకాశం దక్కింది. కొంతమంది ఈ క్విక్ ప్రింట్ గురించి సోషల్ మీడియాలో వీడియోలు కూడా చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: