తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు (HMR) నేటితో విజయవంతంగా 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను సమూలంగా మార్చిన ఈ మెట్రో, నగరవాసులకు ఒక గొప్ప సౌకర్యాన్ని అందించింది.
Read Also: Electric Buses: 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు
ప్రారంభం నుండి నేటి వరకు గణాంకాలు
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణం 2017 నవంబర్ 28న ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి ఫేజ్ను ప్రారంభించగా, నవంబర్ 29, 2017 నుండి ప్రజల కోసం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 3 కారిడార్లలో దాదాపు 57 రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లు ప్రతిరోజూ సుమారు 1,100 ట్రిప్పులు తిరుగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. నిత్యం 4-5 లక్షల మంది ప్రయాణికులను మెట్రో వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఈ మెట్రో, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది.
హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ను మరింత బలోపేతం చేసి, నగరంలోని ఎక్కువ ప్రాంతాలకు అనుసంధానం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లింక్ను నిర్మించడానికి ప్రణాళ
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: