📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Hyderabad Crime: వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య

Author Icon By Pooja
Updated: November 29, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లోని( Hyderabad Crime) మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘట్‌కేసర్‌లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ప్రతిరోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్తను, భార్య మరియు కుమారుడు కలిసి దారుణంగా హత్య చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: ibomma ravi: ఐబొమ్మ రవి విచారణ: క్లౌడ్ సర్వర్లో 21 వేల సినిమాల గుర్తింపు

వివరాలు, హత్యకు దారితీసిన కారణం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బోడుప్పల్ దేవేందర్ నగర్‌లో( Hyderabad Crime) నివసించే బండారు అంజయ్య (55) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య బుగమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, అంజయ్య ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యాపిల్లలను తీవ్రంగా వేధించేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన కుటుంబం ఈ దారుణానికి పాల్పడింది.

హత్య జరిగిన తీరు

గురువారం రాత్రి అంజయ్య తన భార్య బుగమ్మ, కుమారుడు రాజు, బంధువు శేఖర్‌తో కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో వేధింపులు ఎక్కువ కావడంతో, భార్య, కుమారుడు మరియు బంధువు అర్ధరాత్రి సమయంలో అంజయ్య మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అంజయ్య కుమార్తెను నిందితులు ఓ గదిలో బంధించారు. అనంతరం జరిగిన విషయాన్ని కుమార్తె పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలాానికి చేరుకున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Ghatkesar Crime Google News in Telugu Husband Killed by Wife Son Hyderabad Murder Case Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.