Hyderabad crime: తెలంగాణలోని హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రదర్శన సమయంలో ఓ వ్యక్తి ఆకస్మికంగా మరణించారు. కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో ఈ దుర్ఘటన జరిగింది.
Read Also: AP: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ
వివరాల్లోకి వెళ్తే, రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్ శనివారం ఉదయం 11.30 గంటలకు సినిమా చూసేందుకు థియేటర్కు వచ్చారు. సినిమా చూస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుర్చీలోనే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన ప్రేక్షకులు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటే(Heart Attack) మృతికి కారణంగా భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు వైద్య పరీక్షల అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ఘటనతో థియేటర్లో విషాద వాతావరణం నెలకొంది. సినిమా మధ్యలోనే ప్రదర్శనను నిలిపివేయగా, అక్కడున్న ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: