📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Hyderabad to Bangalore in 2 hours : బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం

Author Icon By Sai Kiran
Updated: September 15, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad to Bangalore in 2 hours : ఎప్పటి నుంచో ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు నిజంగా ఆచరణలోకి వస్తోంది. (Hyderabad to Bangalore in 2 hours) ఇప్పటివరకు ఈ రెండు మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణం దాదాపు 19 గంటలు పడుతుండగా, త్వరలో అదే ప్రయాణం కేవలం 2 గంటల్లోనే పూర్తవనుంది.

దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించారు. మొత్తం 626 కి.మీ పొడవున్న ఈ హై-స్పీడ్ రైలు లైన్ కోసం రైల్వే కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేస్తోంది. సర్వే పూర్తయిన తర్వాత డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పంపనున్నారు. ఆమోదం వచ్చిన వెంటనే కన్‌స్ట్రక్షన్ టెండర్లు జారీ అవుతాయి.

ఈ లైన్‌ను గంటకు 350 కి.మీ డిజైన్ స్పీడ్ తో రూపొందిస్తున్నారు. సాధారణంగా ఇది గంటకు 320 కి.మీ ఆపరేషనల్ స్పీడ్ తో నడుస్తుంది. ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ లైన్ తరహాలోనే దీనిని డిజైన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం సూచించబడిన ప్రధాన స్టేషన్లు హైదరాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు. ఇవి ఇంకా ప్రాథమిక ప్రతిపాదనలు మాత్రమే. DPR పూర్తయ్యాకే తుది నిర్ణయం తీసుకుంటారు.

ఇంత పెద్ద ప్రాజెక్ట్ కోసం కావాల్సిన భూసేకరణ ఒక పెద్ద సవాల్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం దక్షిణ భారత ప్రధాన నగరాలను కలిపే మరో హై-స్పీడ్ నెట్‌వర్క్ ప్రణాళికను ప్రస్తావించారు.

ఇప్పటివరకు ఒక నగరం నుంచి ఇంకో నగరానికి రోజంతా సమయం కేటాయించాల్సి వచ్చేది. కానీ ఈ బుల్లెట్ ట్రైన్‌తో కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చు. ఇది ప్రారంభమైతే దక్షిణ భారత ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తుంది.

Read also :

https://vaartha.com/income-tax-department-it-returns-deadline-ends-today/business/547502/

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.