కూకట్పల్లి (kukatpally) ప్రాంతంలో ఈ రోజు ట్రాఫిక్పై ప్రత్యేక ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అఖండ 2 సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా కైతలాపూర్ గ్రౌండ్స్ వద్ద భారీగా అభిమానులు చేరే అవకాశం ఉండడంతో, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూకట్పల్లి కైతలాపూర్ పరిసరాల్లో పలు రూట్లపై వాహనాలను మళ్లించనున్నట్టు అధికారులు తెలిపారు.
Read also: Hyderabad Metro: మెట్రో రైలు.. ఎనిమిదేళ్ల ప్రగతికి ప్రతీక!

Alert for Kukatpally residents
అఖండ 2 ప్రీరిలీజ్ వేడుకను కూకట్పల్లిలో నిర్వహించడంతో
హైదరాబాద్లో పెద్ద ఈవెంట్ల సమయంలో తరచూ ట్రాఫిక్ మార్పులు అమల్లోకి వస్తుంటాయి. ఇదే నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 ప్రీరిలీజ్ వేడుకను కూకట్పల్లిలో నిర్వహించడంతో భారీ జనసందోహం ఏర్పడవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అభిమానుల రాకతో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో స్థానికులకు అసౌకర్యం తలెత్తకుండా కొన్ని మార్గాలను తాత్కాలికంగా మూసివేయడం లేదా ఇతర దారులకు మళ్లించడం నిర్ణయించారు.
ట్రాఫిక్ డైవర్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి
- మూసాపేట్ ఎంట్రన్స్
భరత్నగర్, ఎర్రగడ్డ వైపు నుంచి ముసాపేట్ ద్వారా కూకట్పల్లి వద్దకు వచ్చే వాహనాలను GHMC ఆఫీస్ తర్వాత కూకట్పల్లి Y-జంక్షన్ వైపు మళ్లిస్తారు. - అశోకా వన్ మాల్ చుట్టుపక్కల
కూకట్పల్లి Y-జంక్షన్ నుంచి ఐడీఎల్ లేక్ రూట్ వైపు వెళ్లే వాహనాలను JNTU రోడ్కు మళ్లిస్తారు. - మాదాపూర్ – యశోద హాస్పిటల్ రూట్
మాదాపూర్, హైటెక్ సిటీ నుంచి కైతలాపూర్ వైపు వచ్చే వాహనాలను నెక్సస్ మాల్–JNTU రూట్కు మళ్లిస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: