హైదరాబాద్ శివార్లలో ఆదిభట్ల పరిధిలోని నర్మదా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అకస్మాత్తుగా మూతపడటంతో సుమారు 300 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ కంపెనీ ప్రధానంగా పార్లే (parle) బిస్కెట్లుకి అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తోంది. యాజమాన్యం ఏ విధమైన ముందస్తు సమాచారం ఇవ్వకుండానే డిసెంబర్ 1, 2025 నుండి గేట్లు మూసివేసింది. 18 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఆందోళనలో ఉన్నారు.
Read also: Breaking News: హైదరాబాద్లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!
biscuit company suddenly shuts down
జీతాలు చెల్లించకపోవడం పై ఆగ్రహం
ఈ సంస్థలో 40 శాశ్వత ఉద్యోగులు, 260 కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. 45 రోజులుగా జీతాలు రాలేదు. కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా మారిందని వారు చెబుతున్నారు.
ధర్నా ద్వారా న్యాయం కోరుతున్నారు
హెల్పర్లు, ఆపరేటర్లు, లైన్ కట్టర్లు, సూపర్వైజర్లు పెద్ద ఎత్తున కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానికంగా ఉపాధి పొందుతామని నమ్మిన వారికీ ఈ మూతపడటం అనూహ్య దెబ్బగా ఉంది. కార్మికులు ప్రభుత్వాన్ని, కార్మిక శాఖ అధికారులను సమక్షించి తగిన నష్టపరిహారం మరియు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పరిశ్రమ నియమాలు పాటించకపోవడం పై విమర్శలు
పారిశ్రామిక నిబంధనల ప్రకారం, లేఆఫ్ ప్రకటనకు ముందే ఉద్యోగులకు నోటీసు ఇవ్వాలి. కానీ నర్మదా ఫుడ్ యాజమాన్యం ఈ నియమాలను పాటించలేదు. సమస్య పరిష్కారం కోసం అధికారులు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగులు తాము పొందాల్సిన జీతాలు, కాంట్రాక్ట్ హక్కులను వెంటనే అందించాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: