📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Telugu News: Hyd-Nacharam:చట్నీ మీద పడిందని సిగరెట్లతో వ్యక్తిని కాల్చిచంపిన కిరాతకులు

Author Icon By Pooja
Updated: November 5, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిన్న విషయాలకు కొందరు రాద్దాంతం చేస్తుంటారు. మరికొందరు అయితే ఎంత పెద్ద తప్పు చేసినా ఇట్టే క్షమించి వేస్తారు. ఇది మనలో ఉండే సంస్కారానికి నిదర్శనం. తప్పులు, పొరపాట్లు ఎవరైనా చేస్తుంటారు. కానీ వాటిని ఓపికతో క్షమించే గుణం ఉండాలి. ఇదే మానవ విలువల్ని పెంచుతుంది. కానీ కొందరు పోకిరీలు ఉంటారు, చిన్న విషయాలకే రాద్దాంతం చేసి, ఎనలేని కీడుకు పాల్పడుతుంటారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

read also: PAN Card: ఈ పని చేయకపోతే మీ పాన్ రద్దవుతుంది

Hyd-Nacharam

చట్నీ మీద పడిందని వెంటాడు, హతమార్చారు.. హైదరాబాద్ – నాచారం(Hyd-Nacharam) ప్రాంతంలో అర్థరాత్రి 2గంటలకు సరదాగా కారులో తిరుగుతున్న మహ్మద్ జునైద్ (18), షేక్ నైఫుద్దీన్ (18), మణికంఠ (21), మరో బాలుడు(16)ను, ఎల్బీనగర్ వద్ద మురళికృష్ణ(45) అనే వ్యక్తి లిఫ్ట్ అడిగి వీరి కారులో ఎక్కాడు. అయితే ఎన్టీఆర్ఎస్ఐ ప్రాంతంలో యువకులు అందరూ కలిసి టిఫిన్ చేస్తుండగా, ఒక యువకుడిపై మురళి కృష్ణ చట్నీ పడింది. దీంతో అతడిని కారులో బలవంతంగా ఎక్కించుకుని, నామీదే చట్నీ పోస్తావా అంటూ, మురళికృష్ణను పిడిగుద్దులు గుద్దుతూ నరకం చూపించారు. అంతటితో ఆగక రెండుగంటల పాటు కారులో తిప్పితూ, సిగరెట్లతో కాల్చుతూ, చివరికి కత్తితో మురళి కృష్ణను పొడిచారు.

నిందితుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోకిరీలు వదిలిపెట్టలేదు. చివరికి మురళీకృష్ణ చనిపోయాడా లేదా అని నిర్ధారించుకుని, యువకులు కత్తిని మార్గమధ్యలో పడేసి, మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ కారును పార్క్(Hyd-Nacharam) చేసి పారిపోయారు. పోలీసులు నిందితుల సెల్ ఫోన్ల సిగ్నల్ ఆధారంగా అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. పట్టుమని పాతికసంవత్సరాలు లేని ఈ పోకిరీలు తమ ఆనందం కోసం అర్థరాత్రి బయటకు వచ్చి, ఓ వ్యక్తి హత్యకు కారణమయ్యారు. వీరిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉండడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

ChutneyDispute HyderabadCrime NacharamMurder Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.