హైదరాబాద్: HYD బూటకపు ఎన్కౌంటర్ల (Fake Encounters) ద్వారా మావోయిస్టు (Maoist) నాయకులను హత్య చేస్తున్నారని ఆరోపిస్తూ వివిధ రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులతో చర్చలకు అవకాశం కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దేశ పౌరులైన మావోయిస్టులతో ఎందుకు చర్చించడం లేదని నాయకులు ప్రశ్నించారు. ఈ విధానాన్ని నిరసిస్తూ, శుక్రవారం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లోని (Tank Bund) అంబేడ్కర్ విగ్రహం దగ్గర ‘అఖిలపక్ష పార్టీల ధర్నా’ నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాల సేకరణను చేపట్టాలని నిర్ణయించారు.
Read also : Delhi terror : డాక్టర్కు విదేశీ హ్యాండ్లర్ 42 బాంబు వీడియోలు పంపినట్లు విచారణలో…
కాంగ్రెస్, ఇతర పార్టీల విమర్శలు
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజా జీవితంలోకి కలుస్తామని ముందుకొచ్చే మావోయిస్టులకు అవకాశం కల్పించకుండా, వారిని పట్టుకుని చంపేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వంటి ఫాసిస్టు శక్తులు బలపడితే దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను, కాంగ్రెస్, వామపక్ష భావజాలం ఉన్న వారిని బలహీన పర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. మావోయిస్టులతో కేంద్రం చర్చించడం లేదని, పాలకుల తరపున, మావోయిస్టుల తరపున జరిగే హింసను తాము వ్యతిరేకిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
- నాయకుల గుర్తింపు: హిడ్మా, కేశవరావు, తిరుపతి వంటి మావోయిస్టు నాయకులను తాము గుర్తిస్తామని, వారు ఎంచుకున్న పద్ధతి ప్రభుత్వాలకు నచ్చకపోయినా, వారు తమ జీవితాంతం ప్రజల కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు.
- కోదండరామ్ వ్యాఖ్యలు: టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, రాజకీయ ఉద్యమాలను హింసతో రూపుమాపలేరని, వ్యక్తులను చంపి అణచివేయవచ్చు కానీ వ్యవస్థను అణచివేయడం సాధ్యం కాదని సూచించారు.
శ్వేతపత్రం, పర్యావరణ విధ్వంసంపై డిమాండ్లు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు (Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ, ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపిన మావోయిస్టుల మృతదేహాలకు న్యాయమూర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో శవపరీక్షలు నిర్వహించాలని, దీనిని వీడియో తీయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, కేంద్రాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైనా కేంద్రం దాడి చేస్తోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, అడవి ప్రాంతాల్లోని వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తూ, అడ్డుగా ఉన్న మనుషులను చంపేస్తున్నారని ఆరోపించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :