📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: HYD: బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టు నాయకుల హత్య

Author Icon By Sushmitha
Updated: November 21, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: HYD బూటకపు ఎన్‌కౌంటర్ల (Fake Encounters) ద్వారా మావోయిస్టు (Maoist) నాయకులను హత్య చేస్తున్నారని ఆరోపిస్తూ వివిధ రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులతో చర్చలకు అవకాశం కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దేశ పౌరులైన మావోయిస్టులతో ఎందుకు చర్చించడం లేదని నాయకులు ప్రశ్నించారు. ఈ విధానాన్ని నిరసిస్తూ, శుక్రవారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌లోని (Tank Bund) అంబేడ్కర్ విగ్రహం దగ్గర ‘అఖిలపక్ష పార్టీల ధర్నా’ నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాల సేకరణను చేపట్టాలని నిర్ణయించారు.

Read also : Delhi terror : డాక్టర్‌కు విదేశీ హ్యాండ్లర్ 42 బాంబు వీడియోలు పంపినట్లు విచారణలో…

HYD Maoist leaders killed in fake encounters

కాంగ్రెస్, ఇతర పార్టీల విమర్శలు

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజా జీవితంలోకి కలుస్తామని ముందుకొచ్చే మావోయిస్టులకు అవకాశం కల్పించకుండా, వారిని పట్టుకుని చంపేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వంటి ఫాసిస్టు శక్తులు బలపడితే దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను, కాంగ్రెస్, వామపక్ష భావజాలం ఉన్న వారిని బలహీన పర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. మావోయిస్టులతో కేంద్రం చర్చించడం లేదని, పాలకుల తరపున, మావోయిస్టుల తరపున జరిగే హింసను తాము వ్యతిరేకిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

శ్వేతపత్రం, పర్యావరణ విధ్వంసంపై డిమాండ్లు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు (Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపిన మావోయిస్టుల మృతదేహాలకు న్యాయమూర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో శవపరీక్షలు నిర్వహించాలని, దీనిని వీడియో తీయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, కేంద్రాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైనా కేంద్రం దాడి చేస్తోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, అడవి ప్రాంతాల్లోని వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తూ, అడ్డుగా ఉన్న మనుషులను చంపేస్తున్నారని ఆరోపించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Fake encounters Google News in Telugu hyderabad Latest News in Telugu Maoist leaders Political Protest R. Krishnaiah Tank Bund Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.