హైదరాబాద్ : ఇంటర్మీడియట్ లో బైపీసీ చదివిన విద్యార్థులు ఎప్ సెట్-2025 EAPCET 2025 ద్వారా.. బి ఫార్మసీ, పార్మా-డి, బైయో టెక్నాలజీ, బయో మెడికల్ (Bio medical) ఇంజనీరింగ్, ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి నిర్వహించే కౌన్సెలింగ్లో భాగంగా మొదటి విడత సీట్ల కేటాయింపును సోమవారం చేశారు. 10,708 సీట్లకి గానూ 10,012 సీట్లను మొదటి విడతలోనే కేటాయించారు. సీటు పొందిన విద్యార్థులు నేడు (మంగళవారం) ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని లేకపోతే సీటు రద్దవుతుందని సాంకేతిక విద్య శాఖ కమిషనర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. 71,309 మంది ఎప్ సెట్-2025 లో EAPCET 2025 అర్హత సాధించగా వారిలో 15,775 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి హాజరయ్యారు. వారిలో 15,192 మంది 3,90,122 వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 10,012 మందికి సీట్ల కేటాయింపు చేయగా.. మరో 696 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం సీట్లలో 93.5 శాతం సీట్లను కేటాయించారు. మొదటి ఫేజ్లో 462 మంది ఈడబ్యూఎస్ కోటా సీట్లను కేటాయించారు.
Read Also: Mahaboobnagar: హాస్టల్ నచ్చలేదని గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

EAPCET 2025
51 కాలేజీల్లో 100 శాతం సీట్లను కేటాయించారు. వాటిలో 7 యూనివర్సిటీ కాలేజీలుండగా, ఒకటి గవర్నమెంట్ కాలేజీ ఉంది. మరో 43 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లను కేటాయించారు. బి ఫార్మసీలో 122 కాలేజీల్లో 8686 సీట్లు అందుబాటులో ఉంటే.. అందులో 8017 సీట్ల(92.2 శాతం)ను కేటాయించగా మరో 669 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఫార్మా డీలో 74 కాలేజీల్లో 1657 సీట్లు ఉంటే వాటిల్లో 1637 సీట్ల(98.7శాతం)ను కేటాయించారు. మరో 20 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. బయో మెడికల్ (Medical) ఇంజనీరింగ్ లో 2 కాలేజీల్లో 48 సీట్లు ఉంటే మొత్తం సీట్లను కేటాయించారు. బయో టెక్నాలజీలో 5 కాలేజీల్లో 202 సీట్లు ఉండగా వాటిలో కూడా 202 సీట్లను కేటాయించారు. మొత్తం 10,708 సీట్లకు గానూ 10,012 సీట్ల(93.5శాతం)ను కేటాయించగా మరో 696 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఎప్సెట్ (EAPCET) 2025 బైపీసీ మొదటి దశ కౌన్సెలింగ్లో ఎన్ని సీట్లు కేటాయించబడ్డాయి?
మొత్తం 10,708 సీట్లలో 10,012 సీట్లు (93.5%) మొదటి దశలో కేటాయించబడ్డాయి.
సీటు పొందిన విద్యార్థులు ఏం చేయాలి?
విద్యార్థులు మంగళవారం ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. లేకపోతే సీటు రద్దవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: