ఈ గ్రామాల్లో హోలీ పండగ జరుపుకోరు

ఈ గ్రామాల్లో హోలీ పండగ జరుపుకోరు

రంగుల పండుగ అయిన హోలీని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. హోలీ పండగ అంటే చాలు ప్రతి ఒక్కరి మనసులో ఆనందం ఉత్సాహం కలుగుతుంది. హోలీ రోజున శత్రువులు కూడా మిత్రులు అవుతారని పెద్దలు చెబుతారు. ఒకవైపు భారతదేశంలోని ప్రతి ఒక్కరూ హోలీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. అదే సమయంలో దేశంలోని కొన్ని ప్రదేశాలలో హోలీ పండుగ వస్తుందనే ఉత్సాహం కనిపించదు. భారతదేశంలోని ఈ ప్రదేశాలలో హోలీ జరుపుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మార్చి 14, 2025న, దేశం మొత్తం హోలీ పండుగను జరుపుకోనుండగా.. కొన్ని ప్రదేశాలలో హోలీ రంగులు అస్సలు కనిపించవు.

Advertisements
ఈ గ్రామాల్లో హోలీ పండగ జరుపుకోరు

ఉత్తరాఖండ్‌లోని రెండు గ్రామాలు హోలీకి దూరం
మన దేశంలో దేవ భూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఖుర్జన్, క్విల్లి అనే రెండు గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు గ్రామాల్లో దాదాపు 150 సంవత్సరాలుగా హోలీ పండగను జరుపుకోరు. ఈ గ్రామాల ప్రజలు తమ వంశ దేవతకు శబ్దం, సందడి అంటే ఇష్టం ఉండదని నమ్ముతారు. దీంతో ఈ గ్రామంలో హోలీ పండుగ జరుపుకుంటే.. తమ దేవత గ్రామంపై అగ్రహిస్తుందని గ్రామంలో అనుకోని విషాదం సంభవించవచ్చని నమ్మకం.
గుజరాత్‌లోని రామ్సాన్ లో హోలీ సందడి వుండదు
గుజరాత్ రాష్ట్రంలోని రామ్సాన్ అనే ప్రదేశంలో 200 సంవత్సరాలకు పైగా హోలీ జరుపుకోలేదు. ఈ గ్రామ ప్రజలు శ్రీరాముడు వన వాస సమయంలో తమ ప్రదేశాన్ని సందర్శించాడని నమ్ముతారు, అందుకే ఈ ప్రాంతానికి రామ్సాన్ అని పేరు వచ్చింది. సాధారణంగా ఈ గ్రామాన్ని రామేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంత ప్రజలు హోలీ జరుపుకోకపోవడానికి రెండు కారణాలు చెబుతారు. మొదటి కారణం ఏమిటంటే 200 సంవత్సరాల క్రితం హోలిక దహన్ సమయంలో ఈ గ్రామంలో అగ్నిప్రమాదం జరిగి అనేక ఇళ్ళు దగ్ధం అయ్యాయి. ఈ గ్రామంలో హోలికను దహనం చేస్తే గ్రామం మొత్తం అగ్నికి ఆహుతవుతుందని శపించారని నమ్ముతారు.

జార్ఖండ్‌లోని ఈ ప్రదేశంలో హోలీ లేదు
జార్ఖండ్‌లోని దుర్గాపూర్ అనే గ్రామంలో దాదాపు 100 సంవత్సరాల నుంచి హోలీ పండగను జరుపుకోవడం లేదు. గ్రామాన్ని ఏలే రాజు కుమారుడు హోలీ రోజున మరణించాడని.. తర్వాత సంవత్సరం ఆ దేశ రాజు కూడా హోలీ రోజున మరణించాడని నమ్ముతారు. రాజు తుది శ్వాస విడిచే ముందు ఈ గ్రామంలో హోలీ జరుపుకోవద్దని గ్రామ ప్రజలకు చెప్పాడట. అప్పటి నుంచి ఈ గ్రామ ప్రజలు హోలీ పండగకు దూరంగా ఉంటారట.

Related Posts
నేడు నేతాజీ గౌరవార్థం పరాక్రమ దినోత్సవం
నేడు నేతాజీ గౌరవార్థం పరాక్రమ దినోత్సవం1

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా, ఆయన వారసత్వాన్ని గౌరవించేందుకు కటక్‌లోని నేతాజీ జన్మస్థలంలో మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమం జనవరి 23న ప్రారంభమవుతుంది. ఈ Read more

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: అమిత్‌ షా !
We will win the Tamil Nadu assembly elections.. Amit Shah!

ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం.. కోయంబత్తూర్‌: కేంద్రమంత్రి అమిత్‌ షా తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు Read more

ఉత్త‌రాదిలో కూట‌మి నేత‌ల హ‌వా!
ఉత్త‌రాదిలో కూట‌మి నేత‌ల హ‌వా!

ఉత్త‌రాదిలో ఏపీ కూట‌మి నేత‌ల హ‌వా కొన‌సాగుతోంది. మొన్న మ‌హారాష్ట్ర‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం చేయ‌గా, అక్క‌డ బీజేపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. నిన్న ఢిల్లీలో Read more

వైష్ణో దేవి యాత్ర: 72 గంటల నిరసన
వైష్ణో దేవి యాత్ర: 72 గంటల నిరసన

వైష్ణో దేవి రోప్‌వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కత్రాలో 72 గంటల దిగ్బంధనం మాతా వైష్ణో దేవి రోప్‌వే ప్రాజెక్టు కత్రాలో 72 గంటల దిగ్బంధనాన్ని ఎదుర్కొంది. స్థానిక Read more

×