కుంభమేళా లో భారీ ట్రాఫిక్ జామ్ తో భక్తుల యాతనలు..

కుంభమేళా లో భారీ ట్రాఫిక్ జామ్ తో భక్తుల యాతనలు..

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో జనం కుంభమేళాకు బయలుదేరడంతో ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనని, సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాల సమాచారం. హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు. ఆకలిదప్పులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ కదలడంలేదని, ప్రయాగ్ రాజ్ ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉందని ఓ వాహనదారుడు చెప్పారు. మరోవైపు, భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు.

Advertisements

యూపీ సర్కారు వైఫల్యం వల్లే కుంభమేళాకు వెళుతున్న భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ వీడియోను షేర్ చేస్తూ… దీనికి సీఎం యోగి అసమర్థతే కారణమని మండిపడ్డారు. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుంభమేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం విఫలమైందనే దానికి ఈ ట్రాఫిక్ జామే కారణమని అఖిలేశ్ చెప్పుకొచ్చారు. ప్రతిచోట వాహనాల రద్దీ నెలకొనడంతో భక్తులకు ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఔషధాలు, పెట్రోల్‌, డీజిల్‌ వంటివి అందటంలేదని, ఆహారం, విశ్రాంతి లేక భక్తులు నీరసించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కుంభమేళాలో ట్రాఫిక్ జామ్ ఎలా ఏర్పడింది?

భారీ భక్తుల రద్దీ – కోటి మంది భక్తులు ఈ ఏడాది కుంభమేళాకు హాజరయ్యారు.

ప్రయాణ ఏర్పాట్లలో లోపాలు – తాత్కాలిక రహదారుల నిర్వహణ క్షీణించడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి.

వాహనాల పెరుగుదల – లక్షలాది భక్తులు కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో రావడం రోడ్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది.

పోలీసుల అనుసరణలో లోపాలు – ట్రాఫిక్ నియంత్రణ కోసం వేసిన ప్రణాళికలు సరిగ్గా అమలు కాకపోవడం.

Related Posts
Anakapalli : బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు
Anakapalli : బాణాసంచా పరిశ్రమలో భారీ ..

అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కోటిపురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద సంఘటనలో 8 మంది మృతి చెందారు. ఆదివారం Read more

ప్రయాగ్ లో భారీగా ట్రాఫిక్ జామ్
ప్రయాగ్ లో భారీగా ట్రాఫిక్ జామ్

ప్రయాగ్‌రాజ్‌ లో జరుగుతున్న మహాకుంభమేళా ఈ రోజు భక్తుల రద్దీతో మరింత గందరగోళం పెరిగింది. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు Read more

పార్ల‌మెంట్ సీట్ల పై స్టాలిన్ కేంద్రానికి విజ్ఞప్తి
పార్ల‌మెంట్ సీట్ల పై స్టాలిన్ కేంద్రానికి విజ్ఞప్తి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, 72వ పుట్టిన రోజు సందర్భంగా వీడియో సందేశం ద్వారా తన రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన విషయాన్ని తెలిపారు. ఆయన, పార్లమెంట్ సీట్ల Read more

ఏపీపీఎస్సీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా అనురాధ బాధ్య‌త‌ల‌ స్వీక‌రణ‌
anuradha

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో ఈ బాధ్యతలు Read more

Advertisements
×