📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mangalagiri AIIMS Diarrhea:మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం 

Author Icon By Pooja
Updated: March 10, 2026 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mangalagiri AIIMS Diarrhea: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) విద్యార్థులు మరియు సిబ్బంది అకస్మాత్తుగా డయేరియా బారిన పడటంతో క్యాంపస్‌లో కలకలం రేగింది. గత మూడు రోజులుగా హాస్టల్స్‌లో నివసిస్తున్న దాదాపు 25 మందికి పైగా తీవ్రమైన వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అస్వస్థతకు కలుషిత నీరే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు.

Read Also :AP Adulterated Milk: ‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

ప్రత్యేక వార్డులో చికిత్స

పరిస్థితి తీవ్రతను గమనించిన ఎయిమ్స్ యాజమాన్యం, డయేరియా లక్షణాలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ వార్డులో 10 మంది విద్యార్థులకు నిరంతరం చికిత్స అందుతోంది. మిగిలిన వారికి తగిన జాగ్రత్తలు సూచించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు గల మూల కారణాలను అన్వేషించే క్రమంలో, హాస్టల్స్‌లో సరఫరా అవుతున్న నీరు ఎక్కడ కలుషితమైందనే అంశంపై అధికారులు లోతైన విచారణ చేపట్టారు. తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Andhra Pradesh health diarrhea outbreak Mangalagiri AIIMS Mangalagiri Hostels

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.