చికెన్ను ఆస్వాదిస్తూ తినే నాన్ వెజ్ ప్రియులు కొన్ని ఆరోగ్య సమస్యలను మర్చిపోవడం సర్వసాధారణం. అయితే, చికెన్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, చికెన్ తిన్న వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం శారీరక సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.
పాలు, పెరుగు తినొద్దు
చికెన్ తిన్న వెంటనే పాలు లేదా పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి రెండు కలిస్తే అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అలాగే, కొంతమందికి అలెర్జీ లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అందుకే, చికెన్ తిన్న 2–3 గంటలు దాటిన తర్వాత మాత్రమే పాల పదార్థాలను తీసుకోవడం మంచిది.

బంగాళదుంపలతో చికెన్ తినకూడదు
చికెన్తోపాటు బంగాళదుంపలను కలిపి తింటే అధిక బరువుకు దారితీస్తుంది. బంగాళదుంపలో ఉండే కార్బోహైడ్రేట్లు, చికెన్లో ఉండే ప్రోటీన్లతో కలిసి శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా, ఈ రెండు పదార్థాలను వేయించుకుని తింటే, అధిక కొవ్వు శరీరానికి నష్టం కలిగించే ప్రమాదం ఉంది.
నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లను అసలు తినొద్దు
చికెన్ తిన్న వెంటనే నిమ్మ, ద్రాక్ష వంటి ఆమ్లధార భరితమైన పండ్లను తినడం ఆరోగ్యానికి మేలు చేయదు. ఇవి పేగు సమస్యలను కలిగించడంతో పాటు, కడుపులో మంటను కూడా పెంచుతాయి. అదనంగా, నిత్యం చికెన్ తినడం కీళ్ల నొప్పులు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక, చికెన్ తినేటప్పుడు సరైన సమతుల ఆహార నియమాలను పాటించడం ఉత్తమం.