నిర్మాణ పనులను ప్రారంభించిన కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ
పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి: పశ్చిమ వాసుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చొరవతో భీమవరం, ఆచంటలలో అత్యాధునిక ప్రభుత్వ డయాలసిస్ (Dialysis) విభాగాల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ జిల్లాలో భీమవరం విద్య, వైద్య రంగాల్లో ముందున్నప్పటికీ ప్రభుత్వ రంగంలో డయాలసిస్ సెంటర్ లేకపోవడం దురదృష్టి ష్టకరమని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేక పేషెంట్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమస్య తన దృష్టికి వచ్చిందని, అందుకే అత్యవసర వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Read also: Virat Kohli: సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న కోహ్లీ

Dialysis centers in Bhimavaram
మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్
ఈ సెంటర్ ఆరు నెలల్లో అందుబాటులోకి రానుందని, అత్యాధునిక డయాలసిస్ యంత్రాలతో కూడిన 10 బెడ్లను డయాలసిస్ రోగులకు ఉచిత చికిత్స కోసం అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి ప్రకటించారు. అవసరాన్ని బట్టి అదనపు బెడ్లను కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని డయాలసిస్ సేవలు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాడేపల్లిగూడెం డయాలసిస్ సెంటర్ లో అదనపు బెడ్ల కోసం 2 కోట్లు, ఆచంట డయాలసిస్ సెంటర్ కోసం 1 కోటి, అత్తిలిలో డయాలసిస్ మిషన్లకు 75 లక్షలు సి ఎస్ ఆర్ నిధులను సమకూర్చినట్లు శ్రీనివాస వర్మ తెలిపారు. త్వరలో 4 కోట్ల రూపాయల వ్యయంతో మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
పవన్ కళ్యాణ్ పేరు మీద
ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే. పి.ఎ.సి. చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారానికి తాను కూడా పవన్ కళ్యాణ్ పేరు మీద సెంటర్ నిర్మిద్దామని భావిస్తున్న తరుణంలో, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ రెండు కోట్ల సి.ఎస్.ఆర్ నిధులతో అత్యాధునిక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ పి. సూర్యనారాయణ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బి.జె.పి. జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, బి.జె.పి. జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, జనసేన పార్టీ నాయకులు చంద్రశేఖర్, బండి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: