హెల్సింకి యూనివర్సిటీ తాజా అధ్యయనం ఆధునిక జీవనశైలిలో భాగమైన జంక్ ఫుడ్ ప్రమాదాలపై కీలక హెచ్చరికగా నిలిచింది. చిప్స్, కూల్డ్రింక్స్, బర్గర్స్, ప్యాకేజ్డ్ మాంసం వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు కేవలం బరువు పెంచడమే కాకుండా, మెదడు నిర్మాణానికే నష్టం కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ పరిశోధనలో భాగంగా 30,000 మందిపై బ్రెయిన్ స్కాన్లు నిర్వహించగా, జంక్ ఫుడ్ తరచుగా తీసుకునే వారి మెదడులో సెల్ డ్యామేజ్, వాపు, న్యూరాన్ డిస్టర్బెన్స్ వంటి మార్పులు గమనించినట్లు తెలిపారు. ఈ మార్పులు సాధారణం కావని, దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి తగ్గడం, మనసు అస్థిరత, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు రావచ్చని హెచ్చరించారు.
Breaking News – Fire Accident : సూర్యాపేట వద్ద మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్లో ఉన్న కృత్రిమ రంగులు, రసాయన పదార్థాలు, అధిక చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ నేరుగా మెదడు న్యూరాన్లపై ప్రభావం చూపుతాయి. ఈ పదార్థాలు మెదడులోని రివార్డ్ సెంటర్ను ప్రభావితం చేసి, వ్యక్తిని అదే రకమైన చెత్త ఆహారాన్ని పదేపదే తినాలనే ఆకర్షణ కలిగిస్తాయి. దీని వల్ల మనిషి ఆహారపు నియంత్రణ కోల్పోయి, శరీర బరువుతో పాటు మెదడు పనితీరు కూడా క్రమంగా దెబ్బతింటుందని అధ్యయనం స్పష్టం చేసింది. జంక్ ఫుడ్ వల్ల మెదడు ‘రీప్రోగ్రామింగ్’ అవుతూ, ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ అధ్యయనం ప్రజారోగ్య నిపుణులకు పెద్ద సవాల్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఫాస్ట్ ఫుడ్, కూల్డ్రింక్స్ వినియోగం విపరీతంగా పెరగడంతో భవిష్యత్తులో మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో సహజ పదార్థాలు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఆహారంకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. మెదడు ఆరోగ్యం కోసం ప్రాసెస్డ్ ఫుడ్ను తగ్గించడం, నిద్ర, వ్యాయామం, నీటి సేవనం వంటి అలవాట్లు అవసరమని హెల్సింకి యూనివర్సిటీ పరిశోధకులు నొక్కి చెబుతున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/