ఊబకాయం, అధిక బరువు సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారికి వైద్య రంగం నుంచి ఊరట కలిగించే వార్త వచ్చింది. ఇప్పటివరకు ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ప్రముఖ వెయిట్ లాస్ ఔషధం ‘వేగోవి’ (Wegovy) ఇక నోటి ద్వారా తీసుకునే మాత్రగా మార్కెట్లోకి రానుంది. ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ అభివృద్ధి చేసిన ఈ టాబ్లెట్కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: Hormonal Imbalance: థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?

రోజుకు ఒక్కసారి తీసుకునే 25 మిల్లీగ్రామ్ సెమాగ్లూటైడ్ మాత్ర, ఊబకాయం చికిత్స కోసం ఆమోదం పొందిన తొలి ఓరల్ GLP-1 ఔషధంగా గుర్తింపు పొందింది. ఒయాసిస్-4 (OASIS-4) ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్లో నమోదైన సానుకూల ఫలితాల ఆధారంగా ఈ అనుమతులు మంజూరయ్యాయి. ఈ ట్రయల్స్లో పాల్గొన్నవారు 64 వారాల వ్యవధిలో సగటున తమ శరీర బరువులో 16.6 శాతం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ మందు వాడిన కొందరిలో వికారం, వాంతులు వంటి జీర్ణ సంబంధిత దుష్ప్రభావాలు కనిపించినప్పటికీ, ఇవి ఈ తరహా ఔషధాల్లో (Wegovy) సాధారణమేనని వైద్యులు చెబుతున్నారు. ఇంజెక్షన్ల పట్ల భయం లేదా అసౌకర్యం కారణంగా చికిత్సకు దూరంగా ఉన్నవారికి ఈ నోటి మాత్ర మంచి ప్రత్యామ్నాయంగా మారనుంది. భారత్లో ఊబకాయం, డయాబెటిస్ సమస్యలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఔషధం రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వేగోవి, ఓజెంపిక్ వంటి ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, టాబ్లెట్ రూపం చికిత్సను మరింత సులభం చేయనుంది.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మాత్ర ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు బరువు నియంత్రణ సాధించే అవకాశం ఉంది. అయితే భారత్లో దీనిని మార్కెట్లోకి తీసుకురావాలంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతి తప్పనిసరి. ఆ తర్వాత ధర, లభ్యతపై స్పష్టత రానుంది. ప్రస్తుతం భారత్లో విడుదల తేదీపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: